దర్వాజ-హైదరాబాద్
weather forecast-IMD : తీవ్ర ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నక్రమంలో భారత వాతావరణ విభాగం చల్లని కబురును చెప్పింది. దేశంలో అతి త్వరలో వేడిగాలులు, తీవ్రమైన ఎండల నుంచి ఉపశమనం లభిస్తుందని పేర్కొంది. ఎందుకంటే ఈ సారి భారత్ ను రుతుపవనాలు సాధారణ సమయం కంటే మందుగానే తాకనున్నాయని ఐఎండీ పేర్కొంది.
ఈసారి కాస్త త్వరగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశించవచ్చని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ముందుగా అంటే మే నెలాఖరులోగా ప్రవేశించవచ్చని అంచనా. ముందుగా అండమాన్ నికోబార్ దీవుల్ని తాకి..అక్కడ్నించి కేరళ, ఇతర ప్రాంతాల్లో ప్రవేశిస్తాయని ఐఎండీ తెలిపింది. దాదాపు వారం ముందుతానే రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. వర్షాలు సాధారణం కంటే అధికంగానే కురుస్తాయని ఐఎండీ తెలిపింది. 2022 మే 15 నాటికి నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రం & దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశం ఉందని IMD తెలిపింది. ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర మాట్లాడుతూ.. “సాధారణంగా, రుతుపవనాలు మే 15న నికోబార్ దీవుల మీదుగా పురోగమిస్తాయి మరియు మే 22 నాటికి అండమాన్ దీవుల్లోని ఉత్తర బిందువు అయిన మాయాబందర్ను కవర్ చేస్తాయి” అని తెలిపారు.