• నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసిన భారత్
• 57 పరుగులతో రాణించి కోహ్లీ
దర్వాజ-క్రీడలు
Ind Vs Pak : దుబాయ్ వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచ కప్లో ఆదివారం భారత్-పాకిస్థాన్ ల మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచి పాక్ ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. మ్యాచులో ఫస్ట్ లో తడబడ్డ భారత్.. విరాట్ కోహ్లీ సూపర్ ఇన్నింగ్స్ కు తోడు.. పంత్ కీలక ఇన్నింగ్స్ తో గెలుపునకు కావాల్సిన లక్ష్యాన్ని పాక్ ముందుంచింది.
టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఖాతా తెరవకుండానే రోహిత్ శర్మ పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత రాహుల్.. అఫ్రీది బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 11 పరుగులు చేసిన సూర్య కుమార్ వెంటనే వెనుదిరిగాడు. పంత్ కలిసి విరాట్ కోహ్లీ ఇండియా ఇన్నింగ్స్ ను గాడిలోకి తెచ్చారు. టీ-20 వరల్డ్ కప్ ల్లో పాక్ మీద తనకు ఉన్న రికార్డును కంటిన్యూ చేస్తూ విరాట్ కోహ్లీ మరో హాఫ్ సెంచరీతో కదం తొక్కాడు. 49 బంతుల్లో 57 పరుగులు చేసిన కోహ్లీ షాహిన్ షా బౌలింగ్ లో ఔటయ్యాడు. పంత్ 39 పరుగులతో రాణించాడు.
టాస్ కాయిన్తో పాక్ ఎకానమీని పెంచుకుంటారట.. ప్రముఖ వ్యాపారవేత్త సెటైర్లు
T20 World Cup: విండీస్పై ఇంగ్లండ్ 6 వికెట్ల తేడాలో గెలుపు
T20 World Cup: విండీస్ చెత్త రికార్డు..
T20 World Cup: ప్రపంచ కప్లో ఆస్ట్రేలియా బోణీ..
పెట్రోల్ పన్నులతోనే.. ఫ్రీ వ్యాక్సిన్లు.. :కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్పూరీ
బ్రెజిల్ అధ్యక్షుడిపై నేర అభియోగాలు