దర్వాజ-ముంబయి
ICC World Cup 2023 semifinal: విరాట్ కోహ్లీ మరో చరిత్రను లిఖించాడు. క్రికెట్ గాడ్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డులను బ్రేక్ చేశాడు. అత్యధిక వన్డే సెంచరీలు, ప్రపంచ కప్ లో అత్యధిక పరుగులు సాధించి క్రికెట్ లో రికార్డుల మోత మోగించాడు విరాట్. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో వన్డే ప్రపంచకప్ 2023 తొలి సెమీఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. టేబుల్ టాపర్ భారత్, 2019 రన్నరప్ న్యూజిలాండ్ జట్లు సెమీ పైనల్స్ లో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ కు దిగింది.
కెప్టెన్ రోహిత్ శర్మ 29 బంతుల్లో 47 పరుగుల వద్ద ఔటయ్యాడు. టిమ్ సౌథీ బౌలింగ్లో కేన్ విలియమ్సన్ క్యాచ్ అందుకున్నాడు. వన్డే పవర్ ప్లేలో ఐదోసారి రోహిత్ ను టిమ్ సౌథీ ఔట్ చేశాడు. శుభ్మన్ గిల్తో కలిసి రోహిత్ 50 బంతుల్లో 71 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. శుబ్మన్ గిల్ 79 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలోనే క్రికెట్ గాడ్ సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు. 50 ఓవర్లలో భారత్ 7.94 రన్ రేటుతో 397/4 (50) పరుగులు చేసింది.
ఈ తరం గొప్ప బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ..
తన ఆరాధ్య దైవం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న మరో రికార్డును విరాట్ బద్దలు కొట్టాడు. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ రికార్డును బద్దలుకొట్టిన విరాట్ మరో శిఖరానికి చేరుకున్నాడు. ఈ దిగ్గజ బ్యాట్స్ మన్ తన వన్డే కెరీర్ లో 50వ సెంచరీని, అంతర్జాతీయ కెరీర్ లో 80వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో 50 సెంచరీలు పూర్తి చేసుకున్న తొలి బ్యాట్స్ మన్ గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు.
పవర్ ప్లేలో 8.4 రన్ రేట్ తో బ్యాటింగ్ చేసిన భారత్..
పవర్ ప్లేలో శుభారంభం చేసింది. తొలి 10 ఓవర్లలో ఆ జట్టు 8.4 రన్ రేట్ తో బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ తొలి ఓవర్లోనే 10 పరుగులు చేసి న్యూజిలాండ్ పై ఒత్తిడి తెచ్చారు. ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ షార్ట్ స్పెల్ 5 ఓవర్ల పాటు కొనసాగింది. భారత్ దూకుడు బ్యాటింగ్ చూసిన కెప్టెన్ విలియమ్సన్ ఆరో ఓవర్లో స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ను తీసుకురాగా, శాంట్నర్ 11 పరుగుల ఓవర్ ఇచ్చాడు. ట్రెంట్ బౌల్ట్ షార్ట్ లెంగ్త్ బంతిని లాగడానికి రోహిత్ ను రెచ్చగొట్టాడు, కానీ రోహిత్ దానిని బౌండరీగా మార్చాడు. తొమ్మిదో ఓవర్లో టిమ్ సౌథీపై భారీ షాట్ ఆడి రోహిత్ శర్మ వికెట్ కోల్పోయాడు. 29 బంతుల్లో 47 పరుగులు చేసి గిల్ తో కలిసి 71 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. పవర్ ప్లేలో భారత్ స్కోరు బోర్డుకు 84 పరుగులు జోడించింది.
రికార్డుల మోత..
ప్రస్తుత ప్రపంచకప్ లో 600 సిక్సర్లు పూర్తయ్యాయి. రచిన్ రవీంద్ర బౌలింగ్లో శ్రేయాస్ అయ్యర్ 600వ సిక్సర్ బాదాడు. ప్రపంచకప్ లో ఒకే సీజన్లో 600కు పైగా పరుగులు చేసిన మూడో భారత బ్యాట్స్ మన్ గా విరాట్ కోహ్లీ నిలిచాడు. అంతకుముందు 2003లో సచిన్ టెండూల్కర్, 2019లో రోహిత్ శర్మ ఈ ఘనత సాధించారు.
వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. ఆస్ట్రేలియాకు చెందిన రికీ పాంటింగ్ తర్వాతి స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్ తో జరిగిన సెమీఫైనల్లో 28వ పరుగులు చేసిన వెంటనే పాంటింగ్ ను విరాట్ వెనక్కి నెట్టాడు. పాంటింగ్ 375 వన్డేల్లో 13704 పరుగులు చేశాడు. 291వ మ్యాచ్ లో కోహ్లీ ఈ రికార్డును అధిగమించాడు. శ్రీలంకకు చెందిన కుమార సంగక్కర (14234 పరుగులు), భారత ఆటగాడు సచిన్ టెండూల్కర్ (18426 పరుగులు) మాత్రమే కోహ్లీ కంటే ముందున్నారు.