Breaking
Mon. Jun 30th, 2025

Srinagar encounter: శ్రీనగర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

Terrorist, Killed, Infiltration, Jammu Kashmir, security forces, Sudpora, Karnah sector, Police, టెర్రరిస్ట్, హతం, చొరబాటు, జమ్మూ కాశ్మీర్, భద్రతా బలగాలు, సుద్పోరా, కర్నా సెక్టార్, పోలీస్,

దర్వాజ-శ్రీనగర్

Srinagar encounter: జ‌మ్మూకాశ్మీర్ లో టెర్ర‌రిస్టులు ఉన్నార‌నే పక్కాసమాచారంతో సెర్చ్ ఆప‌రేష‌న్ కొన‌సాగిస్తున్న క్ర‌మంలో ఉగ్ర‌వాదులు-భార‌త భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌కు మ‌ధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్ద‌రు ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌య్యారు. కాశ్మీర్ పోలీసులు, భార‌త సైన్యం-ఉగ్ర‌వాదుల‌కు మ‌ధ్య శ్రీనగర్ జిల్లాలోని నౌగామ్ ప్రాంతంలో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. ఇంకా సెర్చ్ ఆప‌రేష‌న్ కొన‌సాగుత‌న్న‌ద‌ని సంబంధిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

గురువారం తెల్లవారుజామున హతమైన ఇద్దరు ఉగ్రవాదులు అగుహ్ ఉగ్రవాద సంస్థతో సంబంధం కలిగి ఉన్నారని పోలీసులు తెలిపారు. AGuH అంటే అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్ ఒక ఉగ్రవాద సంస్థ. ఇది అల్ ఖైదాతో సంబంధాలు కలిగి ఉంది. ఈ గ్రూప్ లోయలో చురుకుగా ఉన్నట్లు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇద్దరు ఉగ్రవాదులను పుల్వామాకు చెందిన ఐజాజ్ రసూల్ నాజర్, షాహిద్ అహ్మద్‌గా గుర్తించారు.

Related Post