Jammu Kashmir encounter: జమ్మూకాశ్మీర్ ఎన్కౌంటర్.. నలుగురు ఉగ్రవాదులు హతం..
దర్వాజ-శ్రీనగర్
Jammu Kashmir: జమ్మూకశ్మీర్లోని కుప్వారా, కుల్గాం జిల్లాల్లో ఆదివారం భద్రతా బలగాలతో జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు పోలీసులు తెలిపారు. కుప్వారాలో ఇద్దరు ఉగ్రవాదులు హతమవ్వగా, కుల్గామ్లో మరో ఇద్దరు హతమయ్యారు. మరికొంత మంది ఉగ్రవాదులు దాక్కున్నారని, రెండు ప్రాంతాల్లో ఇంకా ఆపరేషన్ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్లోని కుల్గామ్లోని దమ్హాల్ హంజి పోరా ప్రాంతంలోని గుజ్జర్పోరా ప్రాంతంలో భద్రతా బలగాలతో జరిగిన ఎన్కౌంటర్లో జైషే మహ్మద్తో సంబంధం ఉన్న ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. భారత సైన్యం, జమ్మూపోలీసులు ఇంకా ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.
#Encounter has started at D.H Pora area of #Kulgam. Police and Army on job. Further details shall follow.@JmuKmrPolice
— Kashmir Zone Police (@KashmirPolice) June 19, 2022
అలాగే, ఉత్తర కశ్మీర్ కుప్వారాలో లష్కరే తోయిబా (ఎల్ఈటీ)కి చెందిన ఇద్దరు పాకిస్థాన్ ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. ముగ్గురు ఉగ్రవాదులు చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. లోలాబ్ ప్రాంతంలో తలదాచుకున్న ఉగ్రవాది షోకెట్ అహ్మద్ షేక్ గురించి సమాచారం అందుకున్న కుప్వారా పోలీసులు ఆర్మీతో కలిసి సంయుక్త యాంటీ-మిలిటెంట్ ఆపరేషన్ ప్రారంభించారు. ఇంకా ఆపరేషన్ కొనసాగుతున్నదని సమాచారం.
#KupwaraEncounterUpdate: Killed #terrorist has been identified as a #Pakistani, linked with proscribed #terror outfit LeT. 2-3 more #terrorists alongwith arrested terrorist trapped in ongoing #encounter: IGP Kashmir@JmuKmrPolice https://t.co/FTbpGgoIVS
— Kashmir Zone Police (@KashmirPolice) June 19, 2022
Share this content: