Loading Now
JammuKashmir Accident

ఘోర ప్ర‌మాదం.. లోయ‌లో ప‌డ్డ బ‌స్సు.. 12 మంది మృతి..ప‌లువురి ప‌రిస్థితి విషమం

ద‌ర్వాజ‌-జ‌మ్మూ

bus falls into gorge in JammuKashmir: జ‌మ్మూకాశ్మీర్ లో ఘోర ప్ర‌మాదం చోటుచేసుకుంది. లోతైన లోయ‌లో ఒక బ‌స్సు ప‌డిపోయింది. ఈ ప్ర‌మాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మ‌రో ఎనిమిది మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వివ‌రాల్లోకెళ్తే.. జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలోని బరేరి నల్లా సమీపంలో వెళ్తున్న ఒక బస్సు లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్ర‌మాదంలో 12 మంది మ‌ర‌ణించారు. మ‌రో ఎనిమిది మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. బస్సు సావ్జియాన్ నుంచి మండికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు, ఆర్మీ సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

జమ్మూకాశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా ఓ ట్వీట్‌లో ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు. “పూంచ్‌లోని సావ్జియాన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. మృతుల కుటుంబాలకు సంతాపం. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరణించిన వారి బంధువులకు రూ.5 లక్షలు అందజేస్తామ‌ని తెలిపారు. క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన చికిత్స అందించాల‌ని అధికారులను ఆదేశించారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు. “పూంచ్‌లోని సావ్జియాన్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం చాలా బాధ కలిగించింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను” అని బాధిత కుటుంబాల‌కు సానుభూతి తెలిపారు.

జ‌మ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. “పూంచ్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో జరిగిన విషాదకరమైన ప్రాణనష్టం గురించి విన్నందుకు చాలా చింతిస్తున్నాము. మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలనీ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను” అని పేర్కొన్నారు.

Share this content:

You May Have Missed