Breaking
Sat. Jun 28th, 2025

Karnataka: బీజేపీ యువనేత హత్య కేసు ఎన్ఐఏకు బ‌దిలి.. కర్ణాటక స‌ర్కారు కీల‌క నిర్ణ‌యం

Karnataka, govt, BJP, murder, NIA, Dakshina Kannada, Basavaraj Bommai, Praveen Kumar Nettare, Mangaluru, కర్ణాటక , ప్రభుత్వం, బీజేపీ, హత్య, ఎన్ఐఏ, దక్షిణ కన్నడ, బసవరాజ్ బొమ్మై, ప్రవీణ్ కుమార్ నెట్టరే, మంగళూరు,

ద‌ర్వాజ‌-బెంగ‌ళూరు

Mangaluru: బీజేపీ కార్యకర్త ప్రవీణ్ కుమార్ నెట్టారే హత్య కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కి అప్పగించనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై శుక్రవారం ప్రకటించారు. బెంగుళూరులో పోలీసు ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించిన త‌ర్వాత‌.. “హత్య కేసు పొరుగున ఉన్న కేరళతో సంబంధం కలిగి ఉంది. ఇది అంతర్రాష్ట్ర వ్యవహారం కావడంతో ఈ కేసును ఎన్‌ఐఏకి అప్పగిస్తున్నారు. ఈ కేసుపై డీజీపీతో చర్చించాను. ఇతర రాష్ట్రాల వ్యక్తుల ప్రమేయంతో ఇది వ్యవస్థీకృత నేరంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి’ అని సీఎం అన్నారు.

“ఇన్‌పుట్‌లను సేకరించిన తర్వాత, మేము కేరళ ప్రభుత్వానికి లేఖ రాస్తాము. తీర ప్రాంతంలోని కర్ణాటక, కేరళ సరిహద్దు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం కర్ణాటక స్టేట్ రిజర్వ్ పోలీస్ (KSRP) ప్లటూన్‌లను దక్షిణ కన్నడ జిల్లాలోని వివిధ పట్టణాలకు పంపుతామని ఆయన చెప్పారు. సున్నితమైన ప్రాంతాల్లో నిఘా పెంచాలని ఆదేశాలు జారీ చేశారు. సూరత్‌కల్‌ పట్టణంలో గురువారం రాత్రి నరికి చంపిన మహ్మద్‌ ఫాజిల్‌ మంగల్‌పేట కేసును ఛేదించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. శాంతి సామరస్యాలను నెలకొల్పేందుకు త్వరలో దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన మత పెద్దల సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

Related Post