దర్వాజ-హైదరాబాద్
Khairatabad MahaGanapati: నగరంలో గణేశుడి మహా నిమజ్జనం సందడి మొదలైంది. హుస్సేన్సాగర్ సహా సుమారు 100 ప్రాంతాల్లో నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది. ప్రస్తుతం సెన్సేషన్ థియేటర్ వరకు చేరుకుంది. భక్తుల జయజయధ్వానాల మధ్య బడా గణేశుడు ముందుకు సాగుతున్నాడు. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్యలో హుస్సేన్సాగర్లో మహాగణపతి నిమజ్జనం పూర్తికానుంది.
కాసేపట్లో బాలాపూర్ గణపతి లడ్డూ వేలం..
మరోవైపు బాలాపూర్ గణపతి గ్రామ ఊరేగింపు ప్రారంభమైంది. ఊరేగింపు అనంతరం ఉదయం 9.30 గంటలకు లడ్డూవేలం నిర్వహించనున్నారు. ఈ వేలంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధాన ఊరేగింపు జరిగే బాలాపూర్- హుస్సేన్సాగర్ మార్గంలో సాధారణ వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ప్రకటించారు. రాత్రి 10 గంటల వరకు ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు.