దర్వాజ-తిరువనంతరపురం
KSRTC bus Accident: కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. 40 మంది గాయపడ్డారు. చనిపోయిన వారిలో విద్యార్థులు కూడా ఉన్నారనీ, మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికాయ యంత్రాంగం వెల్లడించింది.
వివరాల్లోకెళ్తే.. పాలక్కాడ్ జిల్లాలోని వడక్కంచెరిలో కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్ఆర్టీసీ) బస్సును టూరిస్ట్ బస్సు ఢీకోన్న ఘటనలో 9 మంది మరణించగా, 40 మంది గాయపడ్డారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ ఘోర ప్రమాదంలో తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో పాఠశాల విద్యార్థులు కూడా ఉన్నారని సమాచారం.
బసేలియస్ స్కూల్ 10, 11, 12వ తరగతి విద్యార్థులతో టూర్కు వెళ్తున్న బస్సు వేగంగా వస్తున్న బస్సును ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో అదుపు తప్పింది. అదే సమయంలో అంజుమూర్తి మంగళం బస్టాప్ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఆ తర్వాత అదుపు తప్పి పక్కనే ఉన్న వాగులోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదం తీవ్ర ప్రాణ నష్టాన్ని కలుగజేసింది. ఎర్నాకులం జిల్లాలోని బసేలియోస్ విద్యానికేతన్కు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులతో ఉన్న టూరిస్ట్ బస్సు ఊటీకి వెళ్తోంది.
9 people, including 5 students, killed, around 40 injured in collision between private tourist bus and Kerala State Road Transport Corporation (KSRTC) bus at Vadakkenchery in Palakkad district: Police
— Press Trust of India (@PTI_News) October 6, 2022