Breaking
Sat. Jun 28th, 2025

Raj Thackeray: ‘మ‌సీదులపై లౌడ్ స్పీక‌ర్ల‌ను తొల‌గిస్తాం’.. బాలాసాహెబ్ క్లిప్‌ను షేర్ చేసిన రాజ్ థాక్రే

Raj Thackeray shared Balasaheb clip

ద‌ర్వాజ‌-ముంబ‌యి
Loudspeaker Row: మ‌హారాష్ట్రలో లౌడ్ స్పీక‌ర్ల వివాదం మ‌రింత‌గా రాజుకుంటోంది. మ‌హారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్‌) చీఫ్ రాజ్ థాక్రే మ‌సీదుల నుంచి లౌడ్ స్పీక‌ర్ల తొల‌గింపు గురించ ప‌దే ప‌దే ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రిస్తున్నాఉ. మే 3 త‌ర్వాత ఎలాంటి ఘ‌ట‌న‌లు జ‌రిగినా త‌న బాధ్య‌త కాద‌నీ హెచ్చ‌రించిన రాజ్ థాక్రే.. అంత‌కు ముందు ఓ బ‌హిరంగ లేఖ‌ను రాశారు. ‘అజాన్’ శబ్దంతో ప్రజలు ఇబ్బందిపడితే 100కి డయల్ చేసి.. పోలీసులకు ఫిర్యాదు చేయాలని అందులో పేర్కొన్నారు. “మే 4వ తేదీన మీరు లౌడ్‌స్పీకర్ ఆజాన్‌తో మోగడం వింటుంటే, ఆ ప్రదేశాలలో హనుమాన్ చాలీసాను లౌడ్‌స్పీకర్లలో ప్లే చేయండి. అప్పుడే ఈ లౌడ్‌స్పీకర్ల స‌మ‌స్య ఎంటో వారికి అర్థం అవుతుంది.. హిందువులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను” అని MNS నాయకుడు రాజ్ థాక్రే ఆ లేఖ‌లో పేర్కొన్నారు.

ఇక బుధ‌వారం నాడు రాజ్ థాక్ మ‌రోసారి ప్ర‌భుత్వ‌న్ని హెచ్చ‌రించారు. మ‌సీదుల‌పై లౌడ్ స్పీక‌ర్లు, మైకుల తొల‌గింపున‌కు సంబంధించి ఆయ‌న ఇచ్చిన గ‌డువును మ‌ళ్లీ మ‌ళ్లీ గుర్తుచేస్తూ.. ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే రాజ్ థాక్రే.. ‘తన ప్రభుత్వం ఏర్పడినప్పుడు మసీదుల నుండి లౌడ్ స్పీకర్లను తొలగిస్తాను’ అని శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే చేసిన వ్యాఖ్య‌ల‌కు సంబంధించిన పాత వీడియో క్లిప్ ను షేర్ చేశారు. కాగా, రెండు రోజుల క్రితం రెచ్చగొట్టే ప్రసంగం చేశారనే ఆరోపణలపై రాజ్ థాక్రేపై ఔరంగాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ రోజు రాష్ట్రంలోని ప‌లు ప్రాంతాల్లో ఎంఎన్ఎస్ నేత‌లు మ‌సీదుల ముందు హ‌నుమాన్ చాలీసాను ప్లే చేస్తుండ‌గా.. ప‌లువురు కార్య‌క‌ర్త‌ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Related Post