Breaking
Sat. Jun 28th, 2025

రాష్ట్రంలో మాతాశిశు మరణాలు తగ్గాయి: హరీష్ రావు

Health Minister, Harish Rao, maternal and child deaths, Telangana, women, children, హరీశ్ రావు, మాతాశిశు మరణాలు, తెలంగాణ, మహిళలు, చిన్నారులు,

ద‌ర్వాజ‌-హైద‌రాబాద్

Telangana Health Minister Harish Rao: రాష్ట్రంలో మాతాశిశు మరణాలు గణనీయంగా తగ్గాయని, మహిళలు, పిల్లల ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో తెలంగాణ ఇప్పుడు దేశంలో మూడవ స్థానంలో ఉందని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హ‌రీశ్ రావు పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఎంసీహెచ్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటులో భాగంగా ఎర్రమంజిల్ లో 200 పడకల మాతాశిశు సంరక్షణ కేంద్రానికి మంత్రి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా హ‌రీశ్ రావు మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడకముందు ప్రసూతి మరణాలు లక్షకు 92 ఉండగా, మహిళలు, చిన్నారులకు ప్రత్యేక ఆస్పత్రుల ఏర్పాటుతో అది 43కు తగ్గిందన్నారు. శిశు మరణాలు కూడా లక్ష జననాలకు 36 నుంచి 21కి తగ్గాయని తెలిపారు. మహిళలు, చిన్నారులకు ఆరోగ్య సేవలను మెరుగుపరచడంలో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఈ విజయాలు నిదర్శన‌మ‌ని చెప్పారు.

రాష్ట్రంలో ఎంసీహెచ్ ఆస్పత్రుల నిర్మాణానికి ప్రభుత్వం రూ.499 కోట్లు ఖర్చు చేసిందనీ, అదనంగా డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు మంత్రి హ‌రీశ్ రావు ప్రకటించారు. రోజుకు 1500 మంది రోగులకు సేవలందించే డయాలసిస్ కేంద్రాల సంఖ్యను 34 నుంచి 100కు పెంచాలని ప్రభుత్వం భావిస్తోందని పేర్కొన్నారు.

నిమ్స్ అనుబంధ సంస్థగా రూ.55 కోట్లతో నిర్మిస్తున్న 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ ఆసుపత్రి రాష్ట్రంలో మాతాశిశు ఆరోగ్య సంరక్షణను మరింత మెరుగుపర్చాలన్న ప్రభుత్వ నిబద్ధతలో భాగమ‌ని తెలిపారు. మొత్తమ్మీద తెలంగాణలో మహిళలు, చిన్నారుల ఆరోగ్యం, శ్రేయస్సు పట్ల ప్రభుత్వానికి ఉన్న దృఢ సంకల్పానికి ఈ కార్యక్రమాలు నిదర్శనమన్నారు.

Related Post