దర్వాజ-లక్నో
Car Crash On Yamuna Expressway: ఉత్తరప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మధురలోని యమునా ఎక్స్ప్రెస్ వేపై (Yamuna Expressway) పై వెగంగా వస్తున్న రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. చనిపోయిన వారిలో ముగ్గురు మహిళలు, మరో ముగ్గురు పురుషులు, ఓ చిన్నారి ఉన్నారు.
ఈ ప్రమాదంలో చనిపోయిన వారు ఒకే కుటుంబానికి చెందినవారనీ, పెండ్లికి హాజరైన తర్వాత హర్దోయ్ నుండి నోయిడాకు తిరిగి వస్తుండగా.. తెల్లవారుజామున 5 గంటల సమయంలో వారి కారు గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే చనిపోగా.. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు వ్యక్తులు ఆస్పత్రి చికిత్స పొందుతున్నారని తెలిపారు.
ఈ ఘటనపై ప్రధాని మోడీ, ఉత్తప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.
उत्तर प्रदेश के मथुरा में हुई सड़क दुर्घटना हृदयविदारक है। इस हादसे में जिन्होंने अपने प्रियजनों को खो दिया है, उनके प्रति मेरी गहरी संवेदनाएं। इसके साथ ही घायलों के शीघ्र स्वस्थ होने की कामना करता हूं: PM @narendramodi
— PMO India (@PMOIndia) May 7, 2022
मथुरा में यमुना एक्सप्रेस-वे पर सड़क दुर्घटना में हुई लोगों की मृत्यु अत्यंत दुःखद है।
— Yogi Adityanath (@myogiadityanath) May 7, 2022
अधिकारियों को राहत व बचाव कार्य तेजी से संचालित करने तथा घायलों के उपचार हेतु निर्देश दिए गए हैं।
प्रभु श्री राम दिवंगत आत्माओं को शांति तथा घायलों को शीघ्र स्वास्थ्य लाभ प्रदान करें।