దర్వాజ-హైదరాబాద్
Uppal Skywalk bridge: నిత్యం రద్దీగా ఉండే ఉప్పల్ చౌరస్తా దాటకుండా పాదచారులు రోడ్డు దాటేందుకు నిర్మించిన స్కైవాక్ టవర్ ను ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) రూ.36.50 కోట్ల వ్యయంతో ఉప్పల్ స్కైవాక్ ను నిర్మించింది. ఇది 665 మీటర్ల పొడవు, 4 మీటర్ల వెడల్పు, 6 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఇది లిఫ్టులు, ఎస్కలేటర్లు, మెట్లతో సహా ఎనిమిది యాక్సెస్ పాయింట్లను కలిగి ఉంది.
ఈ స్కైవాక్ బస్ స్టాప్, మెట్రో స్టేషన్ లను కలుపుతుంది, ఇది పాదచారులు ఈ ప్రాంతం చుట్టూ తిరగడం సులభం చేస్తుంది. ఉప్పల్ బగాయత్ లోని శిల్పారామంలో నిర్మించిన కన్వెన్షన్ సెంటర్ ను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, జీహెచ్ ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.
Uppal Skywalk Inaugurated: Telangana Government's Exemplary Reinvention of Urban Infrastructure
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) June 26, 2023
Ministers @KTRBRS and @chmallareddyMLA inaugurated the aesthetically designed Skywalk at Uppal Junction.
This @HMDA_Gov project connects six locations around the junction and the… pic.twitter.com/5iqwhFhtNn