• సీఎం యోగి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత
• బీజేపీపై ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బాఘేల్ తీవ్ర విమర్శలు
దర్వాజ-లక్నో
Chhattisgarh chief minister Bhupesh Baghel: ఉత్తరప్రదేశ్లో సీఎం యోగి ఆదిత్యానాథ్ నేతృత్వంలోని బీజేపీ నిరంకుశ పాలన సాగిస్తున్నదని ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బాఘేల్ అన్నారు. బీజేపీ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందనీ, రెండో సారి యోగి అధికారంలో రాలేరని పేర్కొన్నారు. లఖింపూర్ ఖేరీ ఘటన నేపథ్యంలో రైతులను కలవడానికి వెళ్లిన కాంగ్రెస్ నేత ప్రియాంగ గాంధీని యూపీ ప్రభుత్వం నిర్బంధించడంపై ఆయన తీవ్ర స్థాయిలో స్పందించారు.
ఈ క్రమంలోనే బీజేపీ విమర్శలతో విరుచుకుపడ్డారు. యోగి ప్రభుత్వం రెండో సారి అధికారంలేకి రాదన్నారు. ఇప్పటికే బీజేపీ పట్ల రైతులు, యువత, దళితులు, సామాన్య ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందనీ, బీజేపీ పాలన తీరుతో విసిగిపోయారని బాఘేల్ అన్నారు. బీజేపీ రాష్ట్రంలో ప్రజలను మతం పేరుతో విభజిస్తుందని అన్నారు. వారు దీనిని బ్రిటీష్ వారి నుండి నేర్చుకున్నారంటూ విమర్శించారు.
జమ్మూకాశ్మీర్లో ఎదురుకాల్పులు.. ఐదుగురు జవాన్లు మృతి
లఖింపూర్ కేసు: కేంద్ర మంత్రి, ఆయన కుమారుడిని కాపాడేందుకు యోగి ప్రయత్నం
ఢిల్లీ గాలి పీల్చుకోనివ్వట్లేదు !
భారీ వర్షంతో మళ్లీ నీటమునిగిన హైదరాబాద్. వైరలవుతోన్న వీడియోలు
లఖింపూర్ హింస: పోలీసుల ముందుకు కేంద్ర మంత్రి కుమారుడు
వాట్సాప్, ఫేస్ బుక్ లో మళ్లీ అదే సమస్య
యూపీ సర్కారు తీరుపై సుప్రీం అసంతృప్తి