◘ మూడు రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరికలు
దర్వాజ-న్యూఢిల్లీ
Cyclone Gulab: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే 12 గంటల్లో తుపానుగా మారే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) పేర్కొంది. ఈ తుపానుకు ‘గులాబ్’ అని పేరు పెట్టిన ఐఎండీ.. దీని ప్రభావం కారణంగా బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్లలో సాధారణ వర్షాలతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది. శనివారం, ఆదివారం చురుగ్గా ఉంటుందనీ, సోమవారం బలహీనపడుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం.. తుపానుగా మారే అవకాశముందని ఐఎండీ పేర్కొంది. ఆదివారం కళింగపట్నం చుట్టుపక్కల దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రా సరిహద్దుల్లో తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంటూ.. ఉత్తర ఆంధ్రా, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. గులాబ్ తుపాను కారణంగా బెంగాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
పెగాసస్ తో నిఘా పెట్టారు: కేంద్రంపై మమత ఫైర్
మేఘాల్లో విహరిస్తున్న బుట్టబొమ్మ.. ఎందుకంటే?