దర్వాజ-న్యూఢిల్లీ
Lakhimpur Kheri Violence: ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపైకి కేంద్ర మంత్రి పేరిట ఉన్న వాహనం దూసుకొచ్చిన ఘటనలో ఎనిమిది మంది చనిపోయిన సంగతి తెలిసిందే. పలువురు రైతులు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. తాజాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రైతు తేజీందర్ విర్క్ మాట్లాడుతూ.. రైతులపై నుంచి దూసుకుపోయిన కారును కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కారును నడుపుతున్నాడని ఆరోపించాడు. దారుణ ఘటన జరిగి 72 గంటలు గడుస్తున్నా అతన్ని ఇంతవరకు అరెస్ట్ చేయలేదని మండిపడ్డారు.
అలాగే, నిరసనకు దిగిన తమను చంపేందుకు ఒక కుట్ర ప్రకారమే ఇది జరిగిందని తేజీందర్ అన్నారు. యూపీలోకి రైతుల నిరసనలను తాను అనుమతించబోననీ, లఖింపూర్ ను వదిలేయండని అజయ్ మిశ్రా అన్నారని… ఈ వ్యాఖ్యలకు నిరసనగా తాము ఆందోళన చేస్తున్నామని చెప్పారు. తాము రోడ్డు వద్ద నల్ల జెండాలు పట్టుకుని నిల్చున్నామని తెలిపారు.
అయితే, వారు మరో మార్గంలో వెళ్తున్నారనే విషయం మాకు మధ్యాహ్నం 3 గంటలకు తెలియడంతో అక్కడి నుంచి శాంతియుతంగా తాము వెనక్కి వెళ్తుంటే… వేగంగా దూసుకొచ్చిన కార్లు తమను వెనుక నుంచి ఢీకొన్నాయని చెప్పారు. పక్కా ప్రణాళిక ప్రకారమే తమపై నుంచి కార్లను పోనిచ్చారని అన్నారు. అజయ్ మిశ్రా కుమారుడు, వారి మనుషులు కారులో ఉన్నారని చెప్పారు.
బ్లాక్ ఫంగస్.. ప్రపంచంలోని మొత్తం కేసుల్లో 71 శాతం భారత్లోనే..
రైతులపైకి దూసుకెళ్లింది మా కారే.. : కేంద్ర మంత్రి అజయ్ మిశ్ర
బొగ్గు సంక్షోభంతో కరెంట్ కష్టాలు..
నిలిచిపోయిన ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్..
అఫ్ఘాన్లో బాంబు దాడి.. 14 మంది మృతి
రైతులపైకి దూసుకెళ్లిన కేంద్రమంత్రి కాన్వాయ్.. 8 మంది మృతి
లింగ వివక్ష.. పితృస్వామ్యం.. మధ్యలో మహిళ !
పెరిగిన పెట్రోల్ ధరలు.. సెంచరీ కొట్టిన డీజిల్
లాల్ బహదూర్ శాస్త్రి మరణం వెనుక కారణాలు..
యూపీలో మరో దారుణం.. బాలికపై లైంగిక దాడి.. హత్య !