దర్వాజ-లక్నో
Lakhimpur Kheri incident :ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరిలో శాంతియుతంగా రైతులు నిరసన తెలుపుతుండగా.. వారిపైకి కేంద్ర మంత్రి వాహనం దూసుకురావడంతో 8 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా శనివారం పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు.
కాగా, ఆశిష్ మిశ్రామపై మర్డర్ కేసు నమోదుకావడంతో విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు జారి చేసినప్పటికీ.. ఆయన హాజరు కాలేదు. మళ్లీ నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కాకపోతే చర్యలు తప్పవంటూ హెచ్చరించడంతో శనివారం పోలీసుల ముందుకు వచ్చారు. అనారోగ్య కారణాలతో ఇదివరకు పోలీసులు విచారణకు హాజరుకాలేదని వెల్లడించినట్టు సమాచారం.
ఇదిలావుండగా, లఖింపూర్ ఖేరి ఘటనలో మొత్తం 8 మంది చినిపోగా, ఇప్పటివరకు ఎవరినీ అదుపులోకి తీసుకోకపోవడం పై సర్వత్ర ప్రభుత్వ, పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుప్రీంకోర్టు సైతం ఈ కేసు విషయంలో పోలీసులు, ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
వాట్సాప్, ఫేస్ బుక్ లో మళ్లీ అదే సమస్య
యూపీ సర్కారు తీరుపై సుప్రీం అసంతృప్తి
తుమ్మును ఆపితే ఏం జరుగుతుందో తెలుసా?
రెడ్ డ్రెస్ లో మెరిసిపోతున్న బేబమ్మ..
ఆఫ్ఘానిస్థాన్లో బాంబు పేలుడు.. 50 మంది మృతి
కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడే కారు నడిపాడు: గాయపడ్డ రైతు