ఢిల్లీలో పాక్ ఉగ్రవాది అరెస్ట్
దర్వాజ-న్యూఢిల్లీ
Pakistan Terrorist: దేశరాజధాని ఢిల్లీలో ఉగ్రకదలికలు మళ్లీ వెలగుచూడటం కలకలం రేపుతున్నాయి. తాజాగా భారత నకిలీ గుర్తింపు కార్డుతో చెలామణి అవుతున్న ఓ పాకిస్థాన్ ఉగ్రవాదిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మీనగర్లోని రమేష్ పార్క్ ప్రాంతంలో మహ్మద్ అష్రఫ్ అనే ఈ ఉగ్రవాదిని ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అరెస్ట్ చేసింది. అతని వద్ద నుంచి ఏకే-47తోపాటు 60 రౌండ్ల బుల్లెట్లు, ఒక హ్యాండ్ గ్రెనేడ్, 2 పిస్టళ్ల, పలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.
చట్టవిరుద్ధ కార్యకలాపాల చట్టం, పేలుడు పదార్థాల చట్టం, ఆయుధాల చట్టంతోపాటు ఇతర సంబంధిత చట్టాల కింద ఆ ఉగ్రవాదిపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. అతడు పాకిస్థాన్లోని పంజాబ్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.
క్లిష్ట పరిస్థితుల్లో.. విద్యుత్ సంక్షోభం.. : కేజ్రీవాల్
జమ్మూకాశ్మీర్లో ఎదురుకాల్పులు.. ఐదుగురు జవాన్లు మృతి
లఖింపూర్ కేసు: కేంద్ర మంత్రి, ఆయన కుమారుడిని కాపాడేందుకు యోగి ప్రయత్నం
ఢిల్లీ గాలి పీల్చుకోనివ్వట్లేదు !
Share this content: