దర్వాజ-కోల్కతా
Pegasus_Mamata Banerjee :పెగాసస్ స్పైవేర్ తో తమ ఫోన్లను హ్యాక్ చేస్తూ.. తమపై నిఘా పెట్టారంటూ ఆరోపిస్తూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫైర్ అయ్యారు. భవానీపూర్లో శుక్రవారం జరిగిన ర్యాలీలో ఆమె మాట్లాడుతూ.. బీజేపీ పాలనలో చట్ట నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ గూండాగిరీ చేస్తూ దౌర్జన్యాలు సాగిస్తోందని కాషాయపార్టీ నిత్యం అరాచకాలకు పాల్పడుతోందని ఆరోపించారు. బీజేపీ శ్రేణులు వారి ఇండ్లపై వారే బాంబులు వేసుకుంటూ తమపై దాడి జరుగుతోందని గగ్గోలు పెడుతున్నారన్నారని అన్నారు.
అలాగే, “ముఖ్యమంత్రి సహాయ నిధి క్రమం తప్పకుండా ఆడిట్ చేయబడుతుంది. కోవిడ్ -19 కొరకు పిఎం కేర్స్ ఫండ్ ఏర్పడింది, కానీ కేంద్రంలోని బీజేపీ సర్కారు.. ఇది ప్రభుత్వ నిధి కాదని కోర్టుకు చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగులు, సీఎస్ఆర్ ద్వారా లక్షల కోట్ల రూపాయలు విరాళంగా అందుతున్నాయి. ఆ డబ్బంత ఎక్కడుంది?” అంటూ ప్రశ్నించారు.
మేఘాల్లో విహరిస్తున్న బుట్టబొమ్మ.. ఎందుకంటే?
డిప్రెషన్ ను తగ్గించే చిట్కాలివిగో..