దర్వాజ-కోల్కతా
Mamata Banerjee: రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో బెంగాల్ లో బీజేపీ, టీఎంసీ మధ్య పొలిటికల్ వార్ కాకరేపుతోంది. సోమవారం జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల క్రమంలో బీజేపీ బెంగాల్ అంతటా ముఖ్యమంత్రి మమతా బెనర్జీని “ఆదివాసి వ్యతిరేకి” అని పేర్కొంటున్న పోస్టర్లను ఏర్పాటు చేసింది. 50 వేల వరకు ఈ పోస్టర్లు ఉంటాయని స్థానిక మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఆ పోస్టర్లలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము కూడా ఉన్నారు. అలాగే, మమతా బెనర్జీ గిరిజనులతో ఉన్నట్టు కనిపిస్తున్నారు.
ఆ పోస్టర్ లో గ్లౌజ్లు ధరించిన గిరిజన సంఘం సభ్యులు నృత్యం చేస్తున్నప్పుడు మమతా బెనర్జీ చేతులు పట్టుకున్నట్లుగా ఉంది. అలీపుర్దూర్ జిల్లాలో జరిగిన ‘జనజాతీయ’ కార్యక్రమంలో మహిళలు గ్లౌజులు ధరించాలని సీఎం మమతా బెనర్జీ పట్టుబట్టారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. కాగా, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో నిలిపిందతి. ఇక తృణమూల్ కాంగ్రెస్, అనేక ఇతర ప్రతిపక్ష పార్టీలు తమ రాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాను బరిలోకి దించాయి.
Presidential election: West Bengal BJP puts up posters calling Mamata Banerjee ‘anti-tribal’. These came out because TMC did not support Draupadi Murmu.
— Darvaaja News (@DarvaajaNews) July 17, 2022
#PresidentialElections2022 #TMC #MamataBanerjee #BJP #DraupadiMurmu #WestBengal pic.twitter.com/SC84hZZlge