దర్వాజ-భోపాల్
Train hit a man: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఫోటోలు, మీడియోలు పంచుకోవడానికి యువత చేస్తున్న విన్యాసాలు అన్నీఇన్నీ కావు. అయితే, పలువురు భయానక విన్యాసాలను చేస్తూ… ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే రన్నింగ్ ట్రెయిన్ పక్కన నిలబడి వీడియో తీసుకోవాలన్న ఒక యువకుడి మోజు అతని నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.
వివరాల్లోకెళ్తే.. మధ్యప్రదేశ్ లోని ఔషంగాబాద్ జిల్లాలో ఇటార్సీ-నాగ్పూర్ రైల్వే లైన్ పక్కనగల శ్రద్ధదేవ్ ఏరియాకు చెందిన సంజు చౌరే (22) సోషల్ మీడియాలో వీడియోను పోస్టు చేయడం కోసం రన్నింగ్ ట్రెయిన్ పక్కన నిలబడి వీడియో తీసుకోవాలనుకున్నాడు. ఈ మేరకు రైల్వే ట్రాక్ పక్కన నిలబడగా అతని స్నేహితుడు వీడియో తీస్తున్నాడు. అయితే, రైలు వేగంగా దగ్గరకు వస్తున్నా పక్కకు జరగక పోవడంతో రైలు ఢీకొని ఎగిరిపడ్డాడు.
తీవ్ర గాయాలపైన సంజు చౌరే అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అయితే, ట్రాక్పై వీరిని గమనించిన లోకోపైలెట్ గట్టిగా హారన్ మోగిస్తూ వచ్చినా సంజు చౌరే పక్కకు జరగకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
తొడ భాగంలో కొవ్వు కరగాలా? అయితే ఈ టిప్స్ పాటించండి..
కూలీ డబ్బులు అడిగితే చేయి నరికిన యజమాని
చల్లగాలి కోసం కారులోంచి తల బయటకు పెట్టింది.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
Bigg Boss: బిగ్ బాస్ లీక్.. ఇంటి నుంచి ఈ వారం ఔట్ అయ్యేది..?
Gold: బంగారం కొనే వారికో గుడ్ న్యూస్..
ఆ పాట వింటే ‘రాధేశ్యామ్’స్టోరీ మొత్తం తెలిసిపోతుందట..
Papagni River: కూలిన పాపాగ్ని నది వంతెన.. నెల రోజులపాటు రాకపోకలు బంద్
Healthcare: పడకేసిన పట్టణారోగ్య వ్యవస్థ
కనీస మద్దతు ధర చట్టం తేవాల్సిందే..