దర్వాజ-న్యూఢిల్లీ
Coronavirus-India: భారత్ లో కోవిడ్-19 మళ్లీ విజృంభిస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న కరోనా రోగుల సంఖ్య మరోసారి ప్రజల్లో భయాందోళనలు కలుగుజేస్తోంది. గడచిన 24 గంటల్లో 5335 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కోవిడ్19 పాజిటివ్ కేసులు 25 వేలు దాటాయి. ప్రస్తుతం దేశంలో కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 25,587కు పెరిగింది. 2022 సెప్టెంబర్ 23 తర్వాత రోజువారీ కేసులు 5 వేలు దాటడం ఇదే తొలిసారి అని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో దేశంలో రోజువారీ కరోనా పాజిటివిటీ రేటు 3.32 శాతంగా ఉంది.
అంతేకాదు గత 24 గంటల్లో కరోనా కారణంగా ఆరుగురు మృతి చెందారు. దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రం మహారాష్ట్ర కాగా, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, తమిళనాడు, కర్ణాటకలో కూడా కరోనా ప్రభావిత రాష్ట్రాల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం 24 గంటల్లో కర్ణాటకలో ఇద్దరు, మహారాష్ట్రలో ఇద్దరు, పంజాబ్ లో ఒకరు కోవిడ్-19తో మరణించారు. కేరళలోనూ ఓ కరోనా రోగి మృతి చెందాడు. దేశంలో వీక్లీ పాజిటివిటీ రేటు 2.89 శాతంగా ఉంది. అయితే గత ఒక్కరోజులో 2826 మంది కరోనాను జయించి ఇళ్లకు చేరుకోవడం ఊరట కలిగించే విషయం. భారత్ లో ఇప్పటివరకు 92.23 కోట్ల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య నివేదికలో పేర్కొంటున్నాయి.
ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ ఎంతటి విధ్వంసం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సమయంలో లక్షలాది మంది చనిపోయారు. శ్మశాన వాటికల్లో అంత్యక్రియల కోసం మృతదేహాల కోసం నిరీక్షించే పరిస్థితి ఏర్పడింది. ఆస్పత్రుల్లో పడకలు దొరకక రోగులు అవస్థలు పడుతున్నారు. అంతేకాకుండా ఆస్పత్రుల నుంచి వచ్చే ఆక్సిజన్, మార్కెట్ నుంచి అవసరమైన మందులు కూడా దొరకని పరిస్థితులను సృష్టించాయి. అయితే, మరోసారి కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్న తరుణంలో ప్రజల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి.
Read More…
జార్ఖండ్ విద్యాశాఖ మంత్రి జగన్నాథ్ మహ్తో మృతి
హనుమాన్ జయంతి.. అలర్ట్ అయిన తెలంగాణ పోలీసులు !
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కి 14 రోజుల రిమాండ్.. ఖమ్మం జైలుకు తరలింపు
భారీ అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన 200 దుకాణాలు