దర్వాజ-పాట్నా
Bihar: ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి నుండి వైదొలిగిన తర్వాత బీహార్లో తన మొదటి పర్యటన సందర్భంగా, కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. అక్కడి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. నితీష్ కుమార్ ప్రధాని కావాలనే తపనతో బీజేపీకి వెన్నుపోటు పొడిచారని అన్నారు. అందుకే ఆర్జేడీ, కాంగ్రెస్తో చేతులు కలిపారని ఆరోపించారు.
“నితీష్ కుమార్కు ఎలాంటి సిద్ధాంతాలు లేవు. 2024 లోక్సభ ఎన్నికలలో బీహార్లో ‘మహాగట్బంధన్’ తారుమారు అవుతుంది. 2025 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. బీహార్ ముఖ్యమంత్రి ఒకే ఒక లక్ష్యం ఉది.. అది ఆయన కూర్చి అలాగే ఉండాలనేది” అంటూ విమర్శలు గుప్పించారు.
నితీష్ కుమార్ ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఒడిలో కూర్చున్నారు. నితీష్ కుమార్కి సీమాంచల్ తగిన సమాధానం చెబుతుందని అమిత్ షా అన్నారు. రాజకీయ పొత్తులు మార్చుకుని నితీష్ ప్రధాని కాగలరా? అని ప్రశ్నించారు. బీహార్లోని సీమాంచల్ ప్రాంతంలో తన రెండు రోజుల పర్యటనలో ఉన్న అమిత్ షా.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీకి చెందిన వివిధ స్థాయిల్లోని నాయకులతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు.
नीतीश जी, लालू जी की गोद में बैठ गए हैं।
— BJP (@BJP4India) September 23, 2022
अब यहां डर का माहौल बन गया है।
लेकिन मैं कहना चाहता हूं कि किसी को डरने की जरूरत नहीं है।
आपके साथ श्री @narendramodi जी की सरकार है।
– श्री @AmitShah pic.twitter.com/znZ8CcrRP7