దర్వాజ- సిద్దిపేట
NSUI state president Venkat Balmuri: విద్యార్థుల ప్రాణాలతో ప్రభుత్వం చెలాగటం ఆడుతోందని, మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో కాంట్రాక్టర్ మార్చే వరకు పోరాటం చేస్తామని NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ హెచ్చరించారు. మంగళవారం నాడు సిద్దిపేట పట్టణంలోని కొండ భూదేవి గార్డెన్ లో స్థానిక నాయకులు నిర్వహించిన ప్రెస్ మీట్ లో NSUI బల్మూరు వెంకట మాట్లాడుతూ.. విద్యార్థుల ఆత్మబలిదానాలతో వచ్చిన తెలంగాణను కల్వకుంట్ల కుటుంబీకులు దోచుకుంటున్నారని అన్నారు. బంగారు తెలంగాణ అని ప్రగాల్బాలు పలుకుతూ.. నేడు విద్యార్థులకు నాసిరకమైన భోజనం, నాణ్యతలేని విద్యను అందిస్తున్నారని ఆగ్రహం వక్తం చేశారు. సిద్దిపేట పట్టణంలోని మైనార్టీ రెసిడెన్షియల్ లో 120 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ కు గురై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందారాని చెప్పారు.
ఈ విషయమై విద్యార్థులను పరామర్శించి వెళుతున్న తనపై స్థానిక ఎమ్మెల్యే & ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పోలీసు బలగాలతో దాడులు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతంలో ఫుడ్ పాయిజన్ అయిందని, అయినా వాటిపై నివారణ చర్యలు తీసుకోవడం లేదనీ, నాణ్యతమైన భోజనం అందించడంలో ప్రభుత్వం విఫలమైనదని ఆరోపించారు.
బాసర ఐఐటీలో ఇదే పరిస్థితి..
ఇటీవల బాసర ఐఐటీలో కూడా ఇదే పరిస్థితి నెలకొందని అన్నారు. ప్రభుత్వం వ్యతిరేక విధానాలపైనా, విద్యార్థులను జరుగుతున్న అన్యాయంపై కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాటం చేస్తామని, బెదిరింపులకు పాల్పడినా.. దాడులకు పాల్పడిన భయపడి ప్రసక్తి లేదన్నారు. రాష్ట్ర హోం మంత్రి బంధువులకు మైనారిటీ రెసిడెన్షియల్లో కాంటాక్ట్ ఇచ్చి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్ధిపేట మైనార్టీ రెసిడెన్షియల్ లో జరిగిన ఘటనలో హాస్టల్ వార్డెన్, ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేశారని, కానీ.. కాంట్రాక్టర్ ను ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. విద్యార్థుల సమస్యలపై పోరాటం చేస్తానని, అందుకు NSUI కార్యకర్తలు సైనికులుగా ఉంటారని ఆయన అన్నారు.
వెంకట్ బల్మూర్ కి ఘన స్వాగతం

సిద్దిపేటకు విచ్చేసిన NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూర్ వెంకట్ కు సిద్దిపేట్ యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ జనరల్ సెక్రెటరీ సాదుల పవన్ కుమార్ ఘన స్వాగతం పలికారు. గత పదిరోజులు క్రితం జరిగిన పోలీసుల ఘర్షణలో గాయపడిన వెంకట్ బల్మూర్ ని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సమయంలో NSUI జిల్లా ప్రధాన కార్యదర్శి అజ్మత్, నంగునూర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మెతుకు శివకృష్ణారెడ్డి, చిరం .చంద్రశేఖర్, అర్జున్,అరవింద్, ఇమ్రాన్లు వెంకట్ బల్మూర్ ని సన్మానించారు.
మంత్రి హరీష్ రావు దిష్టిబొమ్మ దగ్ధం

ప్రెస్ మీట్ అనంతరం స్థానిక సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, NSUI నాయకులతో కలిసి అంబేద్కర్ చౌరస్తాలో మంత్రి హరీష్ రావు దిష్టిబొమ్మను దగ్ధం చేసి.. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బొమ్మల యాదగిరి దరిపల్లి చంద్రం గంప మహేందర్ రావు ముద్దం లక్ష్మి పూజల గోపి మజర్ మాలిక్. వహాబ్ అజ్మత్. సాదుల.పవన్ కుమార్ . సయ్యద్ అతిక్ , గ్యదరిమధు,రాషద్ దావూద్, రజివీర్, సామల సంతోష్ గయ్సఉద్దీన్. హాసునుద్దీన్.బండి శివ కుమార్, గ్యార రఘుపతి, నవీన్, రాకేష్, తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
బల్మూరి వెంకట్ అరెస్టు..

గత పది రోజుల క్రితం.. సిద్దిపేటలోని మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థకు గురైన విద్యార్థినులను పరామర్శించేందుకు వెళ్తున్న NSUI రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసింది. ఈ క్రమంలో వెంకట్ ను బలవంతంగా.. ఆయన వాహనంలో నుంచి దించి అరెస్టు చేశారు.
ఈ క్రమంలో పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట జరగడంతో వెంకట్ మెడ భాగంలో గాయమైంది. అయినా.. ఆయని బాధను పట్టించుకొకుండా.. తొగుట పోలీసుస్టేషనుకు తర లించారు. అయితే.. వెంకట్ ఆరోగ్య పరిస్థితి దిగజారడంతో.. గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్ కు తరలించారు.