దర్వాజ-ఇస్లామాబాద్
పాకిస్తాన్ వరదలు: వినాశకరమైన వరదల కారణంగా పాకిస్తాన్లో మూడు మిలియన్లకు పైగా పిల్లలు ప్రమాదంలో ఉన్నారని ఐక్యరాజ్యసమితి చిల్డ్రన్స్ ఫండ్ (యూనిసెఫ్) తెలిపింది. “పాకిస్తాన్ ఇటీవలి చరిత్రలో అత్యంత తీవ్రమైన వరదల కారణంగా మూడు మిలియన్లకు పైగా పిల్లలకు మానవతా సహాయం అవసరం. వరద నీటి ద్వారా వచ్చే వ్యాధులు, ఇతర సమస్యల్లో మునిగిపోవడం.. పోషకాహారలోపానికి గురయ్యే ప్రమాదం ఉంది” అని యూనిసెఫ్ ప్రకటన పేర్కొంది. జూలై 2022 మధ్యలో ప్రారంభమైన భారీ రుతుపవనాల ప్రభావం దేశవ్యాప్తంగా 116 జిల్లాల్లోని 33 మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేసింది. 66 జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
“ప్రభావిత ప్రాంతాల్లోని పిల్లలు, కుటుంబాల అత్యవసర అవసరాలకు ప్రతిస్పందించడానికి UNICEF ప్రభుత్వం, ప్రభుత్వేతర భాగస్వాములతో కలిసి పనిచేస్తోంది” అని ప్రకటన పేర్కొంది. గత వారం పాకిస్తాన్ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. భారీ వరదల మధ్య సహాయం అందించడానికి ఇతర దేశాలు-అంతర్జాతీయ సంస్థలకు పిలుపునిచ్చింది. పాకిస్తాన్లో ఈ ఏడాది భారీ రుతుపవనాల వర్షాల కారణంగా 33 మిలియన్ల మంది ప్రభావితమయ్యారు. సుమారు 16 మిలియన్ల మంది పిల్లలపై తీవ్ర ప్రభావం పడిందని యూనిసెఫ్ తెలిపింది.

“350 మంది పిల్లలతో సహా 1,100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు, మరో 1,600 మంది గాయపడ్డారు. 287,000 ఇళ్లు పూర్తిగా, 662,000 ఇండ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. కొన్ని ప్రధాన నదులు వాటి ఒడ్డును ముంచెత్తాయి. ఆనకట్టలు పొంగిపొర్లాయి. ఇళ్లు, పొలాలు, రోడ్లు, వంతెనలు, పాఠశాలలు, ఆసుపత్రులు, ప్రజారోగ్య సౌకర్యాలతో సహా కీలకమైన మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి”అని ప్రకటన పేర్కొంది. వరదల వల్ల ప్రభావితమైన ప్రాంతాల్లో 30 శాతం నీటి వ్యవస్థలు దెబ్బతిన్నాయని, డయేరియా-నీటి ద్వారా వచ్చే వ్యాధులు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో పాటు చర్మవ్యాధులు ఇప్పటికే నమోదయ్యాయని యూనిసెఫ్ అంచనా వేసింది.
More than 3 million children need urgent help after torrential rain batters Pakistan.
— UNICEF (@UNICEF) August 31, 2022
With support from partners, UNICEF is working to deliver lifesaving medical equipment, essential medicines, safe drinking water and more.https://t.co/nKgA9RzrJL
“అవి చాలా హాని కలిగించే జనాభాను ప్రభావితం చేస్తాయి. 40 శాతం మంది పిల్లలు ఇప్పటికే వరదలు తాకడానికి ముందు దీర్ఘకాలిక పోషకాహార లోపం వల్ల ఏర్పడిన కుంగుబాటుతో బాధపడుతున్నారు” అని తెలిపింది. ఇప్పటికే నీటి అడుగున ఉన్న ప్రాంతాలలో భారీ వర్షాలు కొనసాగుతున్నందున రాబోయే రోజులు-వారాలలో ప్రమాదకరమైన మానవతా పరిస్థితి మరింత దిగజారుతుందని భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో వరదలు మరింత తీవ్రమవుతాయనే అంచనాలతో, మరింత ఎక్కువ మానవతా-ప్రజారోగ్య ప్రభావంతో, WHO తక్షణ ప్రాధాన్యతలు వరద బాధిత జనాభాకు అవసరమైన ఆరోగ్య సేవలను వేగంగా విస్తరించడం, వ్యాధి పర్యవేక్షణను బలోపేతం చేయడం-విస్తరించడం, వ్యాప్తి నివారణకు చర్యలు తీసుకునే అంశాలను పేర్కొంది.
Floods in Pakistan killed at least 1,191 people, including 380 children — one woman saw her grandchild swept away as she slept.
— AJ+ (@ajplus) August 31, 2022
Rains are up to 28x above average.
Villages are still swamped. Officials say Pakistan is a "fully soaked sponge" with nowhere for water to go. pic.twitter.com/k0ve7JVAWu
