Breaking
Sat. Jun 28th, 2025

PM-KISAN: పీఎం కిసాన్ 11వ ఇన్‌స్టాల్‌మెంట్ పై రైతుల‌కు కేంద్రం గుడ్ న్యూస్ !

PM-KISAN 11th installment to be released by PM Modi on May 31

దర్వాజ-న్యూఢిల్లీ

PM-KISAN: పీఎం కిసాన్ ఇన్‌స్టాల్‌మెంట్ కు సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వం రైతుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 11వ ఇన్‌స్టాల్‌మెంట్‌ను (PM Kisan 11th Installment) విడుదలపై కేంద్ర వ్య‌వ‌సాయ మంత్రిత్వ శాఖ అధికారిక ప్ర‌క‌ట‌న చేసింది. హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో మే 31న 10 కోట్ల మందికి పైగా రైతులకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం కింద రూ.21,000 కోట్ల విలువైన 11వ విడత ఆర్థిక ప్రయోజనాలను ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేయనున్నార‌ని తెలిపింది. దీని కింద రైతుల అకౌంట్‌లో రూ.2,000 చొప్పున జమ చేయ‌నున్నారు.

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో నిర్వ‌హిస్తున్నజాతీయ కార్యక్రమం ‘గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్’లో భాగంగా, తొమ్మిది కేంద్ర మంత్రిత్వ శాఖలు అమలు చేస్తున్న 16 పథకాలు మరియు కార్యక్రమాల లబ్ధిదారులతో మోడీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాట్లాడ‌నున్నారు. గ‌రీబ్ కళ్యాణ్ సమ్మేళన్ ను ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ కార్య‌క్ర‌మాల‌ను ఏడాది పొడవునా జ‌రుపుకోవ‌డంలో భాగంగా నిర్వహిస్తున్నారు.

Related Post