దర్వాజ-న్యూఢిల్లీ
Gopalkrishna Gandhi: అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య ఈ సారి రాష్ట్రపతి ఎన్నికల్లో పోరు రసవత్తరంగా ఉండనుందని తెలుస్తోంది.. ఎందుకంటే అధికార పార్టీ కంటే ప్రతిపక్షాలకు ఓటు బ్యాంకు అధికంగా ఉంది. ప్రతిపక్షాలు ఒక్కటిగా ముందుకు సాగితే తమ అభ్యర్థి గెలుస్తాడు. ఈ క్రమంలోనే అన్ని ప్రతిపక్షపార్టీలను ఏకం చేయడానికి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సిద్ధమయ్యారు. బుధవారం జరిగిన ప్రతిపక్ష పార్టీల సమావేశంలో ప్రతిపక్ష పార్టీల తరఫున రాష్ట్రపతి అభ్యర్థి గురించి చర్చించారు. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా గోపాలకృష్ణ గాంధీ పేరు తెర మీదకు వచ్చిందని సమాచారం.
ప్రతిపక్షాల సమావేశంలో మమతా బెనర్జీ ఆయన పేరును ప్రతిపాదించారని తెలిసింది. అలాగే, ఫరూక్ అబ్దుల్లా పేరును కూడా ఆమె ప్రతిపాదించారు. ఇప్పటివరకు శరద్ పవార్ పేరుపై మాత్రమే ఏకాభిప్రాయం ఉంది. అయితే రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన నిరాకరించారు. ప్రతిపక్షాలు గోపాలకృష్ణ గాంధీని సంప్రదించగా.. నిర్ణయం తీసుకోవడానికి సమయం కోరినట్టు సమాచారం.
గోపాలకృష్ణ గాంధీ గురించి మీకు తెలుసా?
- భారత స్వాతంత్య్ర పోరాటంలో మహాత్మా గాంధీ, రాజగోపాలచారి సేవలు వెలకట్టలేనివి. వారి మనవడే ఈ గోపాల కృష్ణ గాంధీ.
- దేశ రాజధాని ఢిల్లీలో ఏప్రిల్ 1945లో జన్మించిన గోపాలకృష్ణ గాంధీ.. ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్స్ డిగ్రీని సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ ఆఫ్ ఢిల్లీ యూనివర్సిటీ నుంచి పొందారు. ఆయన ఒక రిటైర్డ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారి.
- అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన రచయిత, దౌత్యవేత్త మరియు ప్రజా మేధావి. అనేక దినపత్రికలకు కాలమ్లు రాస్తున్నారు.
- ఇదివరకు గోపాల కృష్ణ గాంధీ 2017 ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే, వెంకయ్య నాయుడు చేతిలో ఓడిపోయారు.
- తమిళనాడులో 1985 వరకు IAS అధికారిగా పనిచేసిన తర్వాత, గోపాల కృష్ణ గాంధీ.. వైస్-ప్రెజెంట్ కార్యదర్శిగా మరియు భారత రాష్ట్రపతికి జాయింట్ సెక్రటరీగా ఉన్నారు.
- అతను IAS అధికారిగా చేరాడు మరియు తమిళనాడు రాష్ట్రంలో పనిచేశాడు. ఆ తర్వాత, అతను భారత ఉపరాష్ట్రపతి కి సంయుక్త కార్యదర్శిగా (1987–1992) కొనసాగారు.
- శ్రీలంకలో భారత హైకమీషనర్ మరియు నార్వేలో భారత రాయబారితో సహా అనేక దౌత్య పదవులను నిర్వహించారు. 2004 మరియు 2006 మధ్య, గాంధీ పశ్చిమ బెంగాల్ గవర్నర్గా మరియు తరువాత బీహార్ గవర్నర్గా కొనసాగారు.
- ప్రస్తుతం ఆయన హర్యానాలోని అశోక విశ్వవిద్యాలయంలో చరిత్ర మరియు రాజకీయ అంశాలను విద్యార్థులకు బోధిస్తున్నారు.
- హిస్టరీ అండ్ పాలిటిక్స్ ప్రొఫెసర్ గా అశోకా యూనివర్సిటీలో కొనసాగుతున్నారు.
- ప్రతిపక్షాలు ఇప్పటికే ఆయనను రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై సంప్రదించాయి. దీనిపై నిర్ణయం తీసుకోవడానికి ఆయన సమయం కోరినట్టు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
