Breaking
Mon. Jun 30th, 2025

కరెన్సీపై గణేషుడు, లక్ష్మిదేవీ ఫొటోలను ముద్రించండి : కేజ్రీవాల్

Delhi, AAP, Arvind Kejriwal, Currency, Lakshmi Devi, Ganesha, India, Economy,ఢిల్లీ, ఆప్, అరవింద్ కేజ్రీవాల్, కరెన్సీ, లక్ష్మీదేవి, గణేషుడు, భారత్, ఆర్థిక వ్యవస్థ, Hindu deities,

దర్వాజ-ఢిల్లీ

Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్య‌మంత్రి, ఆప్ కన్వీనర్ అర‌వింద్ కేజ్రీవాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దేశ కరెన్సీపై హిందూ దేవతలైన గణేష్, లక్ష్మి చిత్రాలను ముద్రించండి అని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి సూచించారు. త‌న‌కు దీపావళి రోజున పూజలు చేస్తున్నప్పుడు త‌న‌కు ఈ ఆలోచన వచ్చిందని ఆయ‌న అన్నారు.

వివ‌రాల్లోకెళ్తే.. భారతదేశ ఆర్థిక స్థితి, దానిని మెరుగుపరచాల్సిన అవసరాన్ని ఉటంకిస్తూ.. ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ బుధ‌వారం మీడియాతో మాట్లాడుతూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. భారత కరెన్సీపై హిందూ దేవతలైన గణేష్, లక్ష్మి చిత్రాలను ముద్రించాల‌ని ప్రధాని నరేంద్ర మోడీకి సూచించారు. “మీకు దేవతలు, దేవతల ఆశీస్సులు ఉన్నప్పుడే ప్రయత్నాలు ఫలిస్తాయి.. అప్పుడు (మేము) ఫలితాలు పొందుతాము” అని కేజ్రీవాల్ విలేకరుల సమావేశంలో అన్నారు. “ఈ రోజు, నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీని అభ్యర్థిస్తున్నాను.. ఒక వైపు భారతీయ కరెన్సీలో గాంధీజీ చిత్రం ఉంది.. అది కూడా అక్కడ ఉండాలి. కానీ మరోవైపు గణేష్‌జీ, లక్ష్మీజీల చిత్రాలను భారతీయ కరెన్సీపై వేయాలి. మన ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి. , మాకు చాలా ప్రయత్నాలు కావాలి… దానితో పాటు దేవుళ్లు-దేవతల ఆశీస్సులు కావాలి”అని ఆప్ అధినేత అన్నారు.

మీకు ఈ ఆలోచన ఎలా వచ్చిందని మీడియా అడిగినప్పుడు.. కేజ్రీవాల్, “నిన్నటికి ముందు నేను దీపావళి పూజ చేస్తున్నప్పుడు, అది (గణేష్-లక్ష్మి చిత్రాలు) భారత కరెన్సీలో ఉండాలని నా మనసులో ఆలోచ‌న వచ్చింది. ఇలా చేయడం ఒక్కటే దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తుందని నేను చెప్పడం లేదు. గణేష్, లక్ష్మీ దేవుళ్ల చిత్రాలను పెడితే దేశం మొత్తం వారి ఆశీస్సులు లభిస్తాయని” అన్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఇండోనేషియాను ఉదహరించారు. ప్ర‌భుత్వం పాత నోట్లను మార్చాల్సిన అవసరం లేదనీ, అయితే చిత్రాలను కొత్త కరెన్సీతో ముద్రించాలని కేజ్రీవాల్ అన్నారు.

“ఇండోనేషియా ముస్లిం దేశం. జనాభాలో 85 శాతం పైన ముస్లింలు, 2 శాతం కంటే తక్కువ హిందువులు ఉన్నారు. కానీ వారి నోట్లపై గణేష్‌జీ బొమ్మను ముద్రించారు. మేము ఎవరికీ వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. ఇది ప్రతి ఒక్కరి..దేశ శ్రేయస్సు”అని పేర్కొన్నారు.

Related Post