Breaking
Sat. Jun 28th, 2025

అజ్మీర్ దర్గా ఖాదీం హైదరాబాద్‌లో అరెస్ట్

Dargah, Khadim, arrest, Hyderabad,Gauhar Chishti, protest, BJP, Nupur Sharma, Prophet Mohammed, Telangana, దర్గా, ఖాదీం, అరెస్ట్, హైదరాబాద్, గౌహర్ చిస్తీ, నిరసన, BJP, నూపుర్ శర్మ, ప్రవక్త మహమ్మద్, తెలంగాణ,Ajmer Dargah Khadim, అజ్మీర్ ద‌ర్గా, Telugu News, ద‌ర్వాజ‌, darvaaja, Telugu News updates, తెలుగు న్యూస్‌, తాజా వార్త‌లు,

దర్వాజ-హైదరాబాద్

Ajmer Dargah Khadim: జూన్ 17న దర్గా వెలుపల ‘సర్ తాన్ సే జుడా’ నినాదం చేసిన అజ్మీర్ దర్గా ఖాదీమ్ సయ్యద్ గౌహర్ చిస్తీని గురువారం హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలకు గాను ఇప్పుడు సస్పెండ్ చేయబడిన బీజేపీ నాయకురాలు నుపుర్ శర్మకు నిరసనగా గౌహర్ చిస్తీ గత నెలలో నినాదాలు చేశారు. ఆయ‌న చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల నేప‌త్యంలో అజ్మీర్ పోలీసులు గౌహర్ చిస్టీపై సుమో-మోటో కేసు నమోదు చేసి అతని కోసం వేట ప్రారంభించారు.

గురువారం ఉదయం బేగంబజార్ ప్రాంతంలో చిస్తీ ఉన్నారనే సమాచారంతో రాజస్థాన్‌కు చెందిన అజ్మీర్ పోలీసుల బృందం అతన్ని అరెస్టు చేసి, ట్రాన్సిట్ వారెంట్‌పై అజ్మీర్‌కు తరలిస్తున్నారు. ఇటీవల అజ్మీర్ దర్గాకు చెందిన మరో మతపెద్ద సల్మాన్ చిస్తీ ప్రవక్త మొహమ్మద్‌పై వివాదాస్పద వ్యాఖ్య చేసినందుకు నూపుర్ శర్మ తలపై బహుమానం ప్రకటించారు. అత‌న్ని కూడా అరెస్టు చేశారు.

అనంతర పరిణామాలు ఉదయ్‌పూర్ హత్య కేసు జూన్ 28న ఇద్దరు ముస్లింలు టైలర్ కన్హయ్య లాల్ తేలీని దారుణంగా హతమార్చడంతో రాజస్థాన్‌లో ఉద్రిక్తత నెలకొంది. నుపుర్ శర్మకు మద్దతు ఇచ్చినందుకు తెలీ హత్యకు గురయ్యాడు. టైలర్‌పై రియాజ్ అఖ్తరీ దాడి చేయగా, అతని సహచరుడు గౌస్ మహ్మద్ ఈ హత్యను ఫోన్‌లో రికార్డ్ చేసి వీడియోను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశాడు. ఈ కేసులో ఇప్పటి వరకు ఏడుగురు నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అరెస్టు చేసింది.

Related Post