Breaking
Sat. Jun 28th, 2025

ఎమ్మెల్సీ కవిత ఇంటిముట్టడి.. బీజేపీ కార్యకర్తలపై కేసు నమోదు

darvaaja,Telugu news, Telugu News updates, తాజా వార్త‌లు, తెలుగు న్యూస్‌, ద‌ర్వాజ‌, Hyderabad, Case booked, BJP members, protesting, Telangana, MLC K Kavitha, హైదరాబాద్, కేసు, బీజేపీ కార్యకర్తలు, ఆందోళనలు, తెలంగాణ, ఎమ్మెల్సీ కవిత,

దర్వాజ-హైదరాబాద్

బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లోని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) ఎమ్మెల్సీ కె.కవిత నివాసం ముట్ట‌డి య‌త్నంలో భాగంగా ఆమె ఇంటి దగ్గర సోమవారం నిర‌స‌న తెలుపుతూ అల్లర్లకు పాల్పడినందుకు 29 మంది భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్యకర్తలపై కేసు నమోదైంది. అదుపులోకి తీసుకున్న వారిని విడుదల చేయాలని పలువురు బీజేపీ కార్యకర్తలు డిమాండ్ చేయడంతో సోమవారం రాత్రి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన నెలకొంది. భారతీయ జనతా పార్టీ, బీజేవైఎం, బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు ఎమ్మెల్సీ కవిత ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. అక్కడే ఉన్న టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు.

ఈ క్ర‌మంలోనే బీజేపీ కార్యకర్తలను పోలీసులు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ప‌లు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్ 41 కింద వారికి నోటీసు ఇవ్వబడింది. అందరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు పంపుతార‌ని సంబంధిత అధికారులు వెల్ల‌డించారు. “ఒక కేసు నమోదైంది. మేము ఇంకా వారిని అరెస్టు చేయలేదు. చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి’ అని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.

Related Post