Udaipur: ఉదయ్పూర్లో క్రూర హత్య.. ఉద్రిక్త పరిస్థితులు.. ఇంటర్నెట్ షట్డౌన్.. భారీగా పోలీసుల మోహరింపు
దర్వాజ-జైపూర్
Jaipur: మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నుపూర్ శర్మకు సోషల్ మీడియాలో మద్దతు తెలుపుతూ.. ట్వీట్ చేసిన ఓ వ్యక్తిని ఇందరు నిందితులు దారుణంగా తల నరికి హత్య చేశారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వైరల్ గా మారడంతో ఉదయ్పూర్లో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. ఇంటర్నెట్ ను నిలిపివేయడంతో పాటు మరో 600 మంది పోలీసులను మోహరించారు. నిందితులను సైతం అదుపులోకి తీసుకున్నారని ఎన్డీటీవీ నివేదించింది.
ఉదయ్పూర్ ఘటన టాప్-10 అంశాలు ఇలా ఉన్నాయి..
- ఉదయ్పూర్లోని రద్దీ మార్కెట్లోని కన్హయ్య లాల్ దుకాణంలోకి ఇద్దరు వ్యక్తులు ఈ మధ్యాహ్నం ప్రవేశించి క్లీవర్తో అతని గొంతు కోశారు. అతని శరీరంపై అనేక కత్తిపోట్లు కూడా ఉన్నాయని పోలీసులు తెలిపారు.
- ఈ ఘటనకు సంబంధించి చిత్రీకరించిన వీడియోలో కన్హయ్య లాల్ దాడికి గురయ్యే ముందు వారిలో ఒకరిని వస్త్రం కోసం కొలుస్తున్నట్లు చూపబడింది. హంతకులు హత్యను తామే చేశామని చెప్పడంతో పాటు ప్రధాని నరేంద్ర మోడీని బెదిరించారు.
- ఉదయ్పూర్లోని కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ ప్రకటించిన పోలీసులు, గౌస్ మహ్మద్ మరియు మహ్మద్ నియాస్ అన్సారీ అనే వ్యక్తులు పారిపోయారని, ఆపై దాడి క్లిప్ను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారని చెప్పారు.
- ప్రవక్త మహమ్మద్పై రెచ్చగొట్టే వ్యాఖ్యలు దేశ విదేశాల్లో వివాదానికి దారితీసిన బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మకు కన్హయ్య లాల్ సోషల్ మీడియాలో మద్దతు తెలిపారు. పోస్ట్ల తర్వాత దర్జీకి కొన్ని సంస్థల నుంచి బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
- నిందితులేవరినీ విడిచిపెట్టవద్దని తమకు ఆదేశాలు అందాయని లా అండ్ ఆర్డర్ అడిషనల్ డైరెక్టర్, సీనియర్ పోలీసు అధికారి హవాసింగ్ ఘుమారియా విలేకరులతో అన్నారు.
- ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు అత్యంత భయానకంగా ఉన్నాయనీ, వాటిని ప్రసారం చేయవద్దని ఘుమారియా మీడియాను కోరారు.
- ఈ ఘటన బాధాకరం.. అవమానకరం అని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ అన్నారు. శత్రుత్వ వాతావరణాన్ని సృష్టించారని పేర్కొన్నారు.
- ఈ సంఘటనలో ప్రమేయం ఉన్న నేరస్థులందరిపై కఠిన చర్యలు తీసుకుంటామనీ, పోలీసులు రంగంలోకి దిగారనీ, ప్రస్తుత పరిస్థితుల్లో శాంతిని కాపాడాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నట్టు గెహ్లాట్ చెప్పారు.
- ఈ సంఘటన వీడియోను షేర్ చేయడం ద్వారా వాతావరణాన్ని పాడుచేయవద్దని నేను అందరికి విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు. దీనిని పంచుకోవడంతో సమాజంలో ద్వేషాన్ని వ్యాప్తి చేయాలనే నేరస్థుల ఉద్దేశ్యం ముందుకు సాగుతుందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు.
- తాను ముఖ్యమంత్రితో, పోలీసు సూపరింటెండెంట్తో మాట్లాడాననీ, వీలైనంత త్వరగా నిందితులను అరెస్టులు చేయాలని కోరానని బీజేపీ నేత గులాబ్ చంద్ కటారియా అన్నారు.
Share this content: