దర్వాజ-సిద్దిపేట
Siddipet: తెలంగాణ వ్యాప్తంగా పనిచేస్తున్న దాదాపు 22 వేల మంది సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులు తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. దీనిలో భాగంగా సమగ్ర శిక్షకు చెందిన ఉద్యోగులు గత 12 రోజులుగా సిద్దిపేట కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును రెగ్యులరైజ్ చేయాలని రాష్ట్రవ్యాప్తంగా దీక్షలు చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని పేర్కొంటున్నారు.