దర్వాజ-హైదరాబాద్
సీజనల్ వ్యాధులు: తెలంగాణలో సీజనల్ వ్యాధులు పెరుగుతున్నాయనీ, జాగ్రత్తగా ఉండాలని వైద్యారోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో గత వారం రోజులుగా సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయని వైద్యారోగ్యశాఖ అధికారి ఒకరు తెలిపారు. ప్రభుత్వ ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె శంకర్ ఎఎన్ఐతో మాట్లాడుతూ రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ కేసులు నమోదవుతున్నాయని, డెంగ్యూ కేసులు కూడా పెరుగుతున్నాయన్నారు. ”గత వారం రోజులుగా సీజనల్ వ్యాధులు పెరుగుతున్నాయి. డెంగ్యూ కేసులు కూడా పెరిగాయి. 60-80 పాజిటివ్ కేసులు… స్థానిక స్వైన్ ఫ్లూ కేసులు కూడా నమోదయ్యాయి. డెంగ్యూ (పిల్లల్లో ఎక్కువ), టైఫాయిడ్ కేసులు పెరుగుతున్నాయి”అని డాక్టర్ శంకర్ చెప్పారు.
జులైలో సీజనల్ వ్యాధులపై రాష్ట్ర ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు కోరారు. “సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్త వహించండి, వర్షాలు, వరదల దృష్ట్యా, సీజనల్ వ్యాధులు పెరిగే అవకాశం ఉంది” అని ఆరోగ్య మంత్రి అన్నారు. తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్లు 24 గంటలు పని చేయాలని, ఫలితాలు త్వరితగతిన వచ్చేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. దాదాపు అన్ని ఆసుపత్రుల్లో డైట్, శానిటేషన్ టెండర్లు పూర్తయ్యాయని, మంచి డైట్, శానిటేషన్ ప్రక్రియ సక్రమంగా జరిగేలా చూడాలని మంత్రి కోరారు. ప్రతి ఆస్పత్రిలో కొత్త డైట్ మెనూ బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.