Loading Now

శ్రీశైలం బ‌య‌లుదేరిన శివ‌స్వాములు

ద‌ర్వాజ‌-రంగారెడ్డి
కందుకూర్ మండ‌లంలోని శివ‌స్వాములు మంగ‌ళ‌వారం శ్రీశైలం బ‌య‌లు దేరారు. శివ‌రాత్రి సంద‌ర్భంగా ఇక్క‌డ ఎంతో మంది శివ భ‌క్తులు దీక్షను చేప‌డ‌తారు. కందుకూర్ మండ‌లంలో శివ మాల‌ను ధ‌రించిన ప‌లువురు భ‌క్తులు శివ‌య్య ద‌ర్శ‌ణం కోసం శ్రీశైలం బ‌య‌లు దేరే ముందు మండ‌లంలోని అన్నోజి గూడలోనున్న పాతర్ల గుట్టలో ప‌లు పూజా కార్య‌క్ర‌మాలు చేశారు.

shivaswamulu2 శ్రీశైలం బ‌య‌లుదేరిన శివ‌స్వాములు

ఈ పాత‌ర్ల గుట్ట‌కు ఎంతో విశిష్ట‌త ఉంది. ఎంతో కాలం నుంచి శివ‌స్వాములు శ్రీశైలం బ‌య‌లు దేరే ముందు ఈ పాత‌ర్ల గుట్ట‌లో ఉండే నరసింహ స్వామిని ద‌ర్శించుకోవ‌డం ఆన‌వాయితిగా వ‌స్తుంది. ఇందులో భాగంగా జ‌రిగిన పూజా కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు చుట్టుప‌క్క‌గా గ్రామాల ప్ర‌జ‌లు బారులు తీరారు. ఈ సంద‌ర్భంగా శివ‌స్వాములు మాట్లాడుతూ.. గ్రామ ప్రజలను స‌ల్లంగా కాపాడ‌మ‌ని కోరుతూ.. ఇక్క‌డి నుంచే శ్రీశైలం బ‌య‌లు దేరుతామ‌ని తెలిపారు. కార్య‌క్ర‌మంలో శివ‌స్వాములు, గ్రామ‌స్తులు, యువ‌కులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ ఓటు వేయడం ఎరుకేనా ?

ప్రశ్నించే గళం కావాలె!

లీడ‌ర్ అన్నో.. ఓట‌ర్ల‌కు గీ ముచ్చ‌ట జ‌ర చెప్పుర్రి!

‘ఆమె’ అలుపెరుగని ఓ శక్తి!

మీ చుట్టూ జరుగుతున్న సంఘటనలను మాకు పంపి.. వాటిని ఈ వెబ్ సైట్ లో చూడొచ్చు. మీ ఊర్లో, టౌన్ లో ఏవైనా ముఖ్యమైన ఘటనలు జరిగితే మాకు తెలియజేయండి. మా వాట్సాప్ నెంబర్:7780448771

Share this content:

You May Have Missed