darvaaja-న్యూఢిల్లీ
satellite communication exercise: సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితుల మధ్య భారత్ రాబోయే ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనే చర్యల్లో భాగంగా శాటిలైట్ ఆధారిత కమ్యూనికేషన్ నెట్వర్క్ను (SKYLIGHT) పరీక్షించించింది. భవిష్యత్తులో జరిగే యుద్ధాల్లో సాంకేతిక వ్యవస్థ కీలకం కానున్న తరుణంలో భారత సైన్యం అన్ని ఉపగ్రహ ఆధారిత వ్యవస్థల కార్యాచరణ సంసిద్ధతను నిర్ధారించడానికి దేశవ్యాప్తంగా మొదటిసారిగా ‘ఎక్సర్సైజ్ స్కైలైట్’ని నిర్వహించింది.
గత నెల జూలై 25 నుంచి 29 వరకు ‘స్కైలైట్’ అని పిలిచే ఈ కసరత్తు జరిగింది. అండమాన్ అండ్ నికోబార్ దీవుల నుండి లడఖ్ వరకు అన్ని రకాల ఉపగ్రహ కమ్యూనికేషన్లు ఇందులో పాలుపంచుకున్నాయి. అలాగే, ఇస్రో సహా పలు ఏజెన్సీలు కూడా భాగంగా ఉన్నాయి. ఈ ఎక్సర్ సైజ్ లో 200 కంటే ఎక్కువ స్టాటిక్ టెర్మినల్స్, 80కి పైగా రవాణా చేయదగిన వాహనాలు, మ్యాన్ పోర్టబుల్ ఆధారిత వ్యవస్థలు పరీక్షించబడ్డాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. భారత సైన్యం 2025 నాటికి సొంత ఉపగ్రహ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ISRO ఉపగ్రహాల సేవలను ఉపయోగించుకుంటోంది.