దర్వాజ-న్యూఢిల్లీ
న్యూఢిల్లీ: నోట్ల రద్దు రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు బుధవారం విచారించనుంది. దీంతో పాటు మరో ఐదు కేసులను ప్రత్యేక ధర్మాసనం విచారణ జరపనుంది. 500, 1000 రూపాయల కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు ఇదివరకు దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలయ్యాయి. డీమానిటైజేషన్ పై దాఖలైన పిటిషన్లను జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, బీఆర్ గవాయ్, ఎఎస్ బోపన్న, వి రామసుబ్రమణియన్, బివి నాగరత్నలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం రేపు విచారించనుంది.
Supreme Court constitution bench will hear tomorrow pleas challenging the Centre's decision to demonetize currency notes of Rs 500 & Rs 1000. Five Judge bench headed by Justice Abdul Nazeer will hear the matter tomorrow
— ANI (@ANI) September 27, 2022
తమ వద్ద ఉన్న పాత రూ.500, రూ.1000 కరెన్సీ నోట్లను కొత్త చట్టబద్ధతతో భర్తీ చేసేందుకు ప్రజలు బ్యాంకుల ముందు బారులు తీరేందుకు దారితీసిన నిర్ణయానికి నకిలీ కరెన్సీ నోట్ల ముప్పు, నల్లధనాన్ని ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించడం వంటి కారణాలను పేర్కొన్నారు. నల్లధనం, అవినీతిని అరికట్టేందుకు నగదు లావాదేవీలను తగ్గించడమే నోట్ల రద్దు లక్ష్యమంటూ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.