దర్వాజ- సిద్దిపేట్
Nangnoor-siddipet: భారత స్వాతంత్య్ర శోభ ప్రతిబింబించేలా సిద్దిపేట జిల్లాలోని నంగునూర్ మండల కేంద్రంలో వజ్రోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంగళవారం ( Nangnoor) మండల కేంద్రంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు ఇంటింటికీ తిరుగుతూ జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల విశిష్ఠతను, త్రివర్ణ పతాక ప్రాముఖ్యతను వివరించారు. ఆగస్టు 15న ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగరేయాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పీఎసీఎస్ చైర్మన్ కోల రమేశ్ గౌడ్, ఎంపీటీసీ కోల సునీత-మహేందర్ గౌడ్, మాజీ ఎంపీటీసీ చౌడుచర్ల జైపాల్ రెడ్డి, పంచాయితీ కార్శదర్మి చంద్రకళ, తెరాస గ్రామశాఖ అధ్యక్షుడు ఉల్లి చిన్నమల్లయ్య యాదవ్, కో ఆషన్స్ సభ్యులు రహీం పాషా, తెరాస నాయకులు వెంకట్ రెడ్డి, రచ్చ సిద్దు, కనకయ్య, జయపాల్ రెడ్డి, టీ.రవి, ఏ. శ్రీనివాస్, డి. గణేశ్, శ్రీధర్ గౌడ్, అశోక్ కుమార్ యాదవ్, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, గ్రామ పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా వజ్రోత్సవ వేడుకలు
75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకల్లో(Swathantra Bharatha Vajrotsavalu) భాగంగా తెలంగాణ కేసీఆర్ రెండు వారాలపాటు రాష్ట్రవ్యాప్తంగా స్వాతంత్య్ర భారత వజ్రోత్సవ వేడుకలకు నిర్వహించాలని ఆదేశించడం తెలిసిందే. స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని ప్రజలందరిలో మేల్కొలిపేలా వేడుకలు ఉండాలని సీఎం పేర్కొన్నారు. ప్రతి గుండెలో భారతీయత నిండేలా చూడాలని సీఎం అన్నారు. సమున్నతంగా, అంగరంగ వైభవంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలు తెలంగాణ రాష్ట్రంలో జరపాలని ఆదేశించారు.
వజ్రోత్సవాల షెడ్యూల్:
ఆగస్టు 08 : స్వతంత్ర భాతర వజ్రోత్సవ ద్విసప్తాహం’ ప్రారంభోత్సవ కార్యక్రమాలు
ఆగస్టు 09 : ఇంటింటికీ జాతీయ పతాకాల పంపిణీ ప్రారంభోత్సవం
ఆగస్టు 10 : వజ్రోత్సవ వన మహోత్సవంలో భాగంగా.. గ్రామ గ్రామాన మొక్కలు నాటడం., ఫ్రీడం పార్కుల ఏర్పాటు
ఆగస్టు 11 : ఫ్రీడం రన్ నిర్వహణ
ఆగస్టు 12 : రాఖీ దినోత్సవం సందర్భంగా వివిధ మీడియాల సంస్థల ద్వారా ప్రత్యేక వజ్రోత్సవ కార్యక్రమాల ప్రసారాలకు విజ్జప్తి
ఆగస్టు 13 : విద్యార్థులు, యువకులు, మహిళలు, వివిధ సమాజిక వర్గాల భాగస్వామ్యంతో వజ్రోత్సవ ర్యాలీలు
ఆగస్టు 14 : సాయంత్రం సాంస్కృతిక సారథి కళాకారుల చేత నియాజకవర్గ కేంద్రాల్లో ప్రత్యేక సాంస్క్రతిక జానపద కార్యక్రమాలు. ప్రత్యేకంగా బాణాసంచాతో వెలుగులు విరజిమ్మడం
ఆగస్టు 15 : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
ఆగస్టు 16 : ఏక కాలంలో, ఎక్కడివారక్కడ ’తెలంగాణ వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన. సాయంత్రం కవి సమ్మేళనాలు, ముషాయిరాల నిర్వహణ
ఆగస్టు 17 : రక్తదాన శిబిరాల నిర్వహణ
ఆగస్టు 18 : ఫ్రీడం కప్’ పేరుతో క్రీడల నిర్వహణ
ఆగస్టు 19 : దవాఖానాలు, వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలు, జైల్లలో ఖైదీలకు పండ్లు స్వీట్ల పంపిణీ.
ఆగస్టు 20 : దేశభక్తిని, జాతీయ స్పూర్తిని ప్రకటించే విధంగా ముగ్గుల పోటీలు.
ఆగస్టు 21 : అసెంబ్లీ ప్రత్యేక సమావేశం. దాంతో పాటు ఇతర స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశం.
ఆగస్టు 22 : ఎల్బీస్టేడియంలో వజ్రోత్సవ ముగింపు వేడుకలు.