దర్వాజ-క్రీడలు
T20 World Cup 2021: టీ20 ప్రపపంచ కప్-2021 లో చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. అబుదాబీలోని షేక్ జాయెద్ స్టేడియంలో టీ20 ప్రపంచకప్లో భాగంగా సూపర్ 12 దశలో శనివారం ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా దేశాల మధ్య మొదటి మ్యాచ్ జరిగింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 118 రన్స్ చేసింది. మక్రమ్ ఒక్కడే 40 పరుగులతో రాణించగా.. ఆస్ట్రేలియా కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో మిగతా ఆటగాళ్లు స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. స్టార్క్, హాజిల్ వుడ్, జంపాలు రెండేసి వికెట్లు తీశారు.
119 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఒకానొక దశలో 100 పరుగులు కూడా చేయలేని స్థితిలో కనబడింది. అయితే, చివరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో రెండు బంతులు మిగిలుండగానే విజయం సాధించింది. ఆస్ట్రేలియా తరఫున స్టీవ్ స్మిత్ 34 పరుగులతో టాప్ స్కోర్ నిలిచాడు. మార్కస్ స్టోయినిస్ 16 బంతుల్లో 24 పరుగులు చేసి.. ఆస్ట్రేలియా గెలుపులో కీలకంగా మారాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు హాజిల్ వుడ్ ను వరించింది.
పెట్రోల్ పన్నులతోనే.. ఫ్రీ వ్యాక్సిన్లు.. :కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్పూరీ
బ్రెజిల్ అధ్యక్షుడిపై నేర అభియోగాలు
ప్రశ్నించినందుకు దాడిచేసిన ఎమ్మెల్యే.. వీడియో వైరల్