దర్వాజ-రంగారెడ్డి
Tadiparthi: ఈత కొట్టడానికి వెళ్లి.. ప్రమాదవశాత్తు నీటిలో మునిగి నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తాడిపర్తి గ్రామంలో చోటుచేసుకుంది. ఆదివారం నాడు 12 ఏళ్లలోపు బాలికతో సహా నలుగురు చిన్నారులు గ్రామంలోని చెరువులో నీటమునిగి మృతి చెందారు. నీటిపై తేలిన మృతదేహాలను స్థానికులు బయటకు తీసుకువచ్చారు. మృతులను రెహానా, సమీర్, ఖలీద్, ఇమ్రాన్లుగా గుర్తించారు. రెండు కుటుంబాలకు చెందిన చిన్నారులు ఈతకు వెళ్లి చెరువులో మునిగి చనిపోయారు.
ఈ విషాదం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సాయంతో చెరువులో నుంచి చిన్నారుల మృతదేహాలను బయటకు తీయడాన్ని పర్యవేక్షించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. దసరా సెలవులు కావడంతో చిన్నారులు ఇలా ఈత కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా విషాదం నింపింది.
కాగా, ఈ వారం ప్రారంభంలో, ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ముగ్గురు విద్యార్థులు వాగులో మునిగి ప్రాణాలు కోల్పోయారు. విద్యార్థులు విహార యాత్రకు చింతూరు మండలం సోకులేరు వాగు వద్దకు వెళ్లారు.