Breaking
Sun. Jun 29th, 2025

Inter First Year Result: వాళ్లందరూ పాస్..

Sabita
Sabita

దర్వాజ-తెలంగాణ

Inter First Year Result:ఇంటర్ ఫస్టియర్ ఫలితాలపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మొదటి సంవత్సరంలో ఫెయిల్ అయిన విద్యార్థులందరినీ కనీస మార్కులతో పాస్ చేస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. శుక్రవారం నాడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సబితా ఇంద్రారెడ్డి విద్యార్థుల గురించి మాట్లాడారు. ‘కరోనా కారణంగా విద్యా రంగం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంది. అయినా విద్యావ్యవస్థను నిర్లక్షం చేయకుండా మన ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంది. దూరదర్శన్ , టీ సాట్ ద్వారా విద్యను అందించడం జరిగింది. వాట్సాప్ గ్రూప్ ను క్రియేట్ చేసి మెరుగైన విద్యను అందించాం. ఇక 9, 10 వ తరగతి విద్యార్థులకు ఎటువంటి పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేసాం.

అలాగే ద్వితియ సంవత్సరం విద్యార్థులను కూడా ప్రమోట్ చేశాం. ప్రతి మనిషికి ఇంటర్ మీడియట్ టర్నింగ్ పాయింట్. పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించేందుకు 900 లకు పైగా గురుకులాలను ఏర్పాటు చేశాం. అలాగే 620 గురుకులాలను ఇంటర్ కు అప్ గ్రేడ్ చేశాం. 172 కస్తూర్బా కాలేజీలను కూడా ఇంటర్ కు అప్ గ్రేడ్ చేశాము. ఇక వారికి మెరుగైన విద్యను అందించేందుకు ప్రభుత్వం డిజిటల్ క్లాసెస్, యూట్యూబ్ ఛానెల్స్ లల్లో కూడా వాళ్ల పాఠాలను పెట్టించాం. ఇక ఇంటర్ ఫస్టియర్ విద్యార్థుల పరీక్షల ప్రిపరేషన్ కోసం ప్రత్యేక శ్రద్ద తీసుకున్నాం. పరీక్షల సమయంలో కూడా ఎంతో శ్రద్ధ తీసుకున్నాం. వారికి లెర్నింగ్ మెటీయర్ ఇచ్చి ఒక నెల టైం ఇచ్చి ఎక్సామ్స్ నిర్వహించాం. 4,59,242 మంది పరీక్షలు రాసారు.

వారిలో 49 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. తప్పు లేకున్నా ఇంటర్ బోర్డును నిందించడం సరైంది కాదు. ఇంటర్ బోర్డు, ప్రభుత్వం ఏదో పెద్ద తప్పుు చేసినట్టు ఈ రోజు ఆందోళన చేయడం సరికాదు. పిల్లల కెరియర్ పేరెంట్స్ కు ఎంత ఇంపార్టెంటో ప్రభుత్వానికి కూడా అంతే ఇంపార్టెంట్. కానీ దీన్ని రాజకీయంగా చూసి కేసీఆర్ ఎదో తప్పు చేసినట్టు చూస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్ లో ఫెయిల్ అయిన విద్యార్థులందరినీ కనీస మార్కులు 35 వేసి పాస్ చేయమని సీఎం ఆదేశాలివ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. సెకండ్ ఇయర్ లో మాత్రం మంచిగా చదివి మంచి మార్కులు సాధించండి. అంతే కానీ సెకండ్ ఇయర్ లో కూడా దర్నాలు, ఆందోళనలు చేస్తే పాస్ చేస్తారని అనుకోవద్దు’ అని సబితా ఇంద్రారెడ్డి అన్నారు.

Bigg Boss Telugu: బిగ్ బాస్ హోస్ట్ గా బాలయ్య బాబు?

Gold Price Today: వావ్ తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే..?

Periods Precautions: పీరియడ్స్ టైంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Crime News: ఇన్ ఫార్మర్ గా పనిచేసాడని.. నోట్లో తుపాకీ పెట్టి కాల్చిండ్రు

Samantha : ‘సెకండ్ హ్యాండ్ ఐటమ్’ ట్రోల్ పై సమంత ఏమందంటే..?

Pushpa Story: వార్నీ.. ‘పుష్ప’ కథ ఆ మూవీ కాపీనా..?

Shriya Saran : అదరహో అనిపిస్తున్న శ్రియ సరన్ లేటెస్ట్ పిక్స్..

Carry Bag Free: ఇక నుంచి అవి ఫ్రీ.. డబ్బులు అడిగితే కఠిన చర్యలే..

Related Post