దర్వాజ-తెలంగాణ
Telangana Inter Students: విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ విద్యార్థులకు మరో సువర్ణావకాశం కల్పించారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో ఎవరికైతే తక్కువ మార్కులు వచ్చాయో.. వాళ్లు ఇంప్రూవ్ మెంట్ పరీక్షలు రాసే అవకాశం కల్పించారు. ఇక శుక్రవారం సాయంత్రం మీడియా సమావేశంలో పాల్గొన్న విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ ఫస్టియర్ లో ఫెయిలైన విద్యార్థులందరినీ కనీస మార్కులతో పాస్ చేస్తున్నట్టు ప్రకటించారు.
ఇక దీనితో పాటుగా పాసైన విద్యార్థులు మార్కుల విషయంలో సంతృప్తి లేకపోతే వాళ్లు మళ్లీ పరీక్షలు రాసి మార్కులను పెంచుకునే అవకాశం కల్పిస్తున్నట్టు ప్రకటించారు. ఇంటర్ సెకండియర్ పరీక్షలతో పాటుగా.. ఫస్టియర్ ఇంప్రూవ్ మెంట్ ఎక్సామ్స్ నిర్వహించనున్నట్టు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలియజేశారు. అలాగే ఫెయిలైన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్లు రీ కౌంటింగ్, రీ వాల్యుయేషన్ కోసం కట్టిన ఫీజులను కూడా చెల్లిస్తామన్నారు.
ప్రభుత్వం కేటాయించిన మార్కులకు విద్యార్థులు సంతృప్తి చెందితే.. వాళ్లు కట్టిన ఫీజులను చెల్లిస్తామని మంత్రి సబితా వెళ్లడించారు. కావాలనుకుంటే మళ్లీ రీ కౌంటింగ్ వెసలుబాటు కూడా ఉందని ఆమె చెప్పారు. ఇంటర్ బోర్డు తప్పులేకున్నా.. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఇక ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల్లో ఒత్తిడికి గురికాకూడదనే ఉద్దేశంతోనే విద్యార్థులందరినీ పాస్ చేసినట్టు ఆమె తెలిపారు. కానీ సెకండ్ ఇయర్ లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇలా పాస్ చేయబోమని ఆమె స్పష్టం చేశారు.
Inter First Year Result: వాళ్లందరూ పాస్..
Bigg Boss Telugu: బిగ్ బాస్ హోస్ట్ గా బాలయ్య బాబు?
Gold Price Today: వావ్ తగ్గిన బంగారం ధరలు.. ఎంతంటే..?
Periods Precautions: పీరియడ్స్ టైంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Crime News: ఇన్ ఫార్మర్ గా పనిచేసాడని.. నోట్లో తుపాకీ పెట్టి కాల్చిండ్రు
Samantha : ‘సెకండ్ హ్యాండ్ ఐటమ్’ ట్రోల్ పై సమంత ఏమందంటే..?
Pushpa Story: వార్నీ.. ‘పుష్ప’ కథ ఆ మూవీ కాపీనా..?
Shriya Saran : అదరహో అనిపిస్తున్న శ్రియ సరన్ లేటెస్ట్ పిక్స్..
Carry Bag Free: ఇక నుంచి అవి ఫ్రీ.. డబ్బులు అడిగితే కఠిన చర్యలే..