Breaking
Sat. Jun 28th, 2025

Raithu bandhu: గుడ్ న్యూస్..రేపటి నుంచే ‘రైతు బంధు’ డబ్బులు జమ

raiithu bandhu
raiithu bandhu

దర్వాజ-తెలంగాణ

Raithu bandhu: అన్నదాతలకు ఆసరాగా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘రైతు బంధు’ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంతో వచ్చే నగదు ఎంతో మంది రైతన్నలకు ఆసరాగా నిలుస్తోంది. ఇక ఈ యాసంగి సీజన్ చెల్లింపులు రేపటి నుంచి నేరుగా రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఎకరాకు రూ.5000 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 61 లక్షల 49 వేల మంది రైతులకు యాసంగి పంటకు రైతు బంధు సొమ్మును ప్రభుత్వం అందించనుంది.

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ మొత్తంగా 7 వేల 600 కోట్లు రూపాయలు నేరుగా వారి వారి ఖాతాల్లో జమ అవనున్నాయి. ఈ యాసంగిలో అధికారుల అంచనా ప్రకారం .. రూ.7,600 కోట్లు పంపిణీ చేయాల్సి ఉంటుందట. అయితే వానాకాలంలో కోటిన్నర ఎకరాలకు గాను రైతుల ఖాతాల్లో రూ. 7,508.78 కోట్ల రూపాయలను జమ చేశారు. ఈ నెల 28 వ తేదీ నుంచి రైతు బంధు నగదు జమ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకే అధికారులు కూడా రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేసేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసే పనిలో పడ్డారు.

రేపటి నుంచి రైతు బంధు సొమ్ము రైతుల ఖాతాల్లో జమ అవనుండగా.. మొదటగా ఎకరం పొలం ఉన్న రైతుల ఖాతాల్లో నగదు పడనుంది. తర్వాత రోజు నుంచి ఒక్కో ఎకరం పెంచుతూ.. డబ్బులను జమ చేస్తారు. రైతుల ఖాతాల్లో సొమ్ము జమ అయిన వెంటనే రైతుల ఫోన్లకు మెసేజ్ కూడా వస్తుంది. ఇకపోతే ఈ ఏడాది జూన్ నుంచి ఈ నెల 10 వరకు 20 వేల మంది కొత్తగా భూములను కొన్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. వీరి వివరాలు రెవెన్యూ రికార్డుల్లో నమోదైతే.. వారికి కూడా రైతు బంధు డబ్బులు జమ అవుతాయి.

Manchu Lakshmi: అందుకు డబ్బులేకపోతే కిడ్నీ అమ్ముకున్నా.. వైరల్ గా మారిన మంచు లక్ష్మి ట్వీట్

Balakrishna : రష్మిక.. నువ్వు నవ్వితే ఇంత అందంగా ఉంటావా: బాలయ్య బాబు

Krithi Shetty: అవసరమైతే అలాంటి సీన్స్ కూడా చేస్తా: కృతి శెట్టి

Ram Gopal Varma: కేక్ ను కసా.. కసమని నరుకుతున్న ఆర్జీవీ..? ఎందుకంటే..?

Anchor Sreemukhi : అదిరే అందాలతో రచ్చ రచ్చ చేస్తున్న అందాల శ్రీముఖి

Telangana Inter Students: ఇంటర్ విద్యార్థులకు మరో అవకాశం

Omicron Symptoms: పిల్లల్లో ఒమిక్రాన్ లక్షణాలు ఏలా ఉంటాయంటే..?

Inter First Year Result: వాళ్లందరూ పాస్..

Bigg Boss Telugu: బిగ్ బాస్ హోస్ట్ గా బాలయ్య బాబు?

Related Post