Breaking
Mon. Jun 30th, 2025

ఈటల రాజేందర్ భూకబ్జా నిజమే: మెదక్ కలెక్టర్

eatala rajendar
eatala rajendar


దర్వాజ-తెలంగాణ
Jamuna Hatcheries Lands:ఈటల రాజేందర్ భూకబ్జాలో అసలు విషయాన్ని బయటపెట్టారు మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్. ఈ కేసుకు సంబంధించి కలెక్టర్ సోమవారం నాడు మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలను వెళ్లడించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జమునా హ్యాచరీ భూముల్లో సీలింగ్ ల్యాండ్ ఉన్నట్టు తేలిందని తెలియజేశారు. మాసాయిపేట మండలంలోని అచ్చంపేట, హకీంపేట్ లోని అసైన్డ్ భూములు కబ్జా అయినట్టు కాలుష్య నియంత్రణ మండలి నివేదిక వెళ్లడించిందని కలెక్టర్ స్పష్టం చేశారు.

జమునా హ్యాచరీస్ ఏకంగా 70.33 ఎకరాల భూమిని కబ్జా చేసినట్టు సర్వేలో తేలిందన్నారు. పైగా ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే పెద్ద పెద్ద ఫౌల్ట్రీ షెడ్లు, రోడ్లు, ప్లాట్ ఫామ్ లు నిర్మించారని కలెక్టర్ వెళ్లడించారు. అందులోనూ సర్వే నంబర్ 130 లో 3, 81 లో 5 ఎకరాల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్న విషయాన్ని కూడా కలెక్టర్ బయటపెట్టాడు. ఇకపోతే టోటల్ గా56 మంది భుములు కబ్జా అయినట్టు కలెక్టర్ నివేదిక సమర్పించారు.

ఇక కబ్జాపై నివేదికను జమునా హ్యాచరీస్ కు పంపినట్టు కలెక్టర్ తెలియజేశారు. ఈ అక్రమాలకు పాల్పడిన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకుంటామని.. ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని ఆయన స్పష్టం చేశారు. ఈటల రాజేందర్ తమ భూములను అక్రమించుకున్నాడని అప్పట్లో మెదక్ జిల్లా అచ్చంపేట గ్రామస్తులు కేసీఆర్ కు ఫిర్యాదు చేసిని సంగతి తెలిసిందే. దాంతో కేసీఆర్ ఈటలను మంత్రి పదవి నుంచి తొలగించారు. ఈ ఆక్రమాలపై కేసీఆర్ ఒక కమిటీని నియమించారు. ఈ కమిటీ ఇప్పుడు జమునా హ్యాచరీస్ భూములను సర్వే చేసి అసలు గుట్టును రట్టు చేసింది.

భారత పౌరసత్వానికి 6 లక్షల మంది గుడ్‌బ‌య్ !

ఏమయ్యా రణ్ బీర్.. లెహంగ పొడవుగా ఉంటే అలా చేయాలా.. అయినా నీకెందుకంత పొగరు .?

ఏంజెల్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు

వామ్మో.. పాయల్ ఇలా చూపించావేంటి.. జనాలు ఉండాలా.. పోవాలా..?

వామ్మో.. విన్నర్ కు మించిన రెమ్యునరేషన్.. అందుకే యాంకర్ రవిని ఇంట్లో నుంచి పంపించారా?

Omicron: ఒమిక్రాన్‌.. డెల్టా కంటే 6 రెట్లు అధిక వ్యాప్తి

చ‌ర్చ లేకుండానే.. సాగు చ‌ట్టాల ర‌ద్దు బిల్లుకు లోక్‌స‌భ ఆమోదం

MSRTC: 6 వేల మంది ఉద్యోగులు సస్పెండ్

ప్చ్..ఇందుకోసమేనా యాంకర్ రవిని ఎలిమినేట్ చేసింది..?

Related Post