• రాజు మరణంపై హైకోర్టులో పిటిషన్
దర్వాజ-హైదరాబాద్
సైదాబాద్ లోని సింగరేణి కాలనీలో ఆరేండ్ల చిన్నారిపై లైంగికదాడి, హత్య కేసులో నిందితుడైన రాజు మరణంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పౌర సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ లంచ్ మోషన్ పిటిషన్ను దాఖలు చేశాడు. రాజుది కస్టోడియల్ మరణంగా అనుమానం ఉందని పేర్కొన్నాడు. ఇటు రాజు తల్లిదండ్రులు సైతం పోలీసులే రాజును ఎన్కౌంటర్ చేశారంటూ ఆరోపించారు.
ఈ నేపథ్యంలో సింగరేణి కాలనీ ఘటన కేసులో నిందితుడైన రాజు ఆత్మహత్యపై తాజాగా డీజీపీ మహేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజు మరణంపై ఎలాంటి అనుమానాలు వద్దని అన్నారు. అతను ఆత్మహత్య చేసుకుంటుండగా పలువురు చూశారని తెలిపారు. వారిలో కోణార్క్ ఎక్స్ ప్రెస్ కు చెందిన ఇద్దరు డ్రైవర్లు, రైల్వే సిబ్బంది, పలువురు రైతులు ఉన్నారు. వారి వాంగ్మూలాలు సైతం తీసుకున్నామని తెలిపారు. ఏవైనా అభిప్రాయాలు లేదా రాజు మరణానికి సంబంధించిన ఆధారాలు ఉంటే మాట్లాడాలంటూ పేర్కొన్నారు.
సింగరేణి కాలనీ ఘటన నిందితుడు ఆత్మహత్య
మోడీ పుట్టిన రోజునే ‘నిరుద్యోగ దినోత్సవం’
గుజారత్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో అత్యధిక క్రైమ్ రేటు
తెలుగు రాష్ట్రాల్లో గలీజు రాజకీయాలు
గుంటూరులో విద్యార్థిని దారుణ హత్య
ఆప్ఘానిస్థాన్ లో తాలిబన్ల రాక్షస పాలన.. షరియా చట్టం