దర్వాజ-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2021-22 ఏడాదికి సంబంధించి రూ. 2,30,825.96 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఇందులో రెవెన్యూ వ్యయం రూ. 1,69,383.44 కోట్లు.. ఆర్థిక లోటు అంచనా రూ. 45,509.60 కోట్లు.. పెట్టుబడి వ్యయం రూ. 29,046.77 కోట్లు.. రెవెన్యూ మిగులు రూ. 6,743.50 కోట్లుగా ఉంది.
శాఖల వారిగా కేటాయింపులను పరిశీలిస్తే.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు బడ్జెట్లో పెద్దపీట వేశారు. రూ.29,271 కోట్లు కేటాయించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు నియోజకవర్గ అభివృద్ధి నిధుల కింద రూ.5 కోట్ల చొప్పున కేటాయిస్తూ వార్షిక పద్దులో రూ.800 కోట్లు లెక్కచూపించారు. ఈసారి దళితుల కోసం ‘సీఎం దళిత్ ఎంపవర్మెంట్’ ప్రత్యేక పథకం ప్రకటించిన ప్రభుత్వం వెయ్యి కోట్లు కేటాయించింది. మొత్తం బడ్జెట్ కేటాయింపులు ఈ విధంగా ఉన్నాయి.
మొత్తం 2,30,825.96కోట్లతో రాష్ట్ర బడ్జెట్
- వైద్యారోగ్య శాఖకు 6295కోట్లు
- పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు- 29,271కోట్లు
- ఇండస్ట్రీస్ 3077కోట్లు
- ఐటీ శాఖ 360కోట్లు
- పౌరసరఫరాల శాఖ 2363కోట్లు
- సరికొత్త విద్యా పథకం కోసం 4000కోట్లు
- పట్టణ వైకుంఠదామాలకు 200కోట్లు
- మూసీ సుందరీకరణ 200కోట్లు

- హైదరాబాద్ మంచినీటికి 250కోట్లు
- నీరా పాలసీ కోసం 25కోట్లు
- మెట్రో రైలు 1000కోట్లు
- భూ సమగ్ర సర్వేకు 400కోట్లు
- ఆసరా పెన్షన్11,728కోట్లు
- కల్యాణ లాక్షి, షాది ముబారక్ 2750కోట్లు
- ఎస్సీ సంక్షేమం 21,306కోట్లు
- ఎస్టీ సంక్షేమం 12,304కోట్లు

- హరిత హారం1276కోట్లు
- బీసీ సంక్షేమం 5522కోట్లు
- గొర్రెల పంపిణీ 3000 కోట్లు
- చేనేత 338కోట్లు
- మైనారిటీ 1606కోట్లు
- మహిళ శిశు సంక్షేమం 1702కోట్లు
- బతుకమ్మ చీరలు 338కోట్లు
- డబుల్ బెడ్ రూం 11,000 కోట్లు
- మున్సిపల్ శాఖ 15030కోట్లు

- పాఠశాల విద్య.. 11,735
- ఉన్నత విద్య…1873
- విద్యుత్..11046
- రోడ్లు భవనాలు..8799 కోట్లు
- రీజినల్ రింగ్ రోడ్ …750 కోట్లు
- ఆర్వోబీ, ఆర్.యూ.బీలకు 400కోట్లు
- హోమ్…6465
- గురుకులాల నిర్వహణకు 561కోట్లు
- పశు సంవర్ధక, మత్స్యశాఖకు 1731కోట్లు
- ఇరిగేషన్ రంగానికి 16,931కోట్లు

- రైతు బంధు 14,800కోట్లు
- రైతు రుణమాఫీకి 5225కోట్లు
- రైతు భీమాకి 1200 కోట్లు
- యాంత్రీకరణకు 1000కోట్లు
- వ్యవసాయానికి 25000కోట్లు
- సీఎం దళిత్ ఎంపవర్మెంట్ స్కీం కోసం 1000కోట్లు
- ఆయిల్ ఫాం రైతులకు ఏకరాకు 30వేల ప్రభుత్వ సబ్సిడీ
- 4 సంవత్సరాల పాటు బ్యాంకు లోను మారిటోరియం
- ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు నియోజకవర్గ అభివృద్ధి నిధుల కింద 800కోట్లు
- ఆర్టీసీకి 3000కోట్లు
- అటవీశాఖ 1276కోట్లు
- దేవాదాయ శాఖకు 720కోట్లు
- నూతన సచివాలయం కు 610కోట్లు
- వరంగల్ కార్పోరేషన్ కు 250కోట్లు
- ఖమ్మం కార్పోరేషన్ కు 150కోట్లు ప్రత్యేకంగా కేటాయింపు
శ్రీవారి కళ్యాణం.. కమనీయం! దేవుని పడకల్ జాతర
ఎమ్మెల్సీ పోరు.. ‘బ్యాలెట్ బాక్సులో గోల్ మాల్’ జరిగిందా?
ఎంపీ అరవింద్ కు కేంద్రంతో కొట్లాడే దమ్ముందా?
మరణ ముప్పు పురుషుల్లోనే అధికం !
ద్వాదశ జ్యోతిర్లింగాలు.. వాటి విశిష్టత!