దర్వాజ-తెలంగాణ
TS News: తెలంగాణాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులను ప్రభుత్వం దాస్తుందన్న వార్తలు పూర్తిగా అవాస్తవమని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు అన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ పెడతారన్న వార్తలపై కూడా ఆయన స్పందించారు. లాక్ డౌన్ పెట్టడం అనేది పూర్తిగా అవాస్తవమని..రానున్న రోజుల్లో లాక్ డౌన్ పెట్టబోమని ఆయన స్ఫష్టం చేశారు. ఇప్పటి వరకు కరోనాను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కోంటోందని చెప్పుకొచ్చారు.
కొత్త వేరియంట్ వచ్చినా.. ప్రభుత్వం దాన్ని ఎదుర్కొనేందుకు సన్నద్దమైందని ఆయన తెలిపారు. భయాందోళనకు గురి చేస్తున్న కొత్త వేరియంట్ గురించి డీ హెచ్ శ్రీనివాస్ రావు మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు విదేశాల నుంచి 900 కు పైబడి రాష్ట్రానికి వచ్చారు. వారిలో 13 మందికే కొవిడ్ పాజిటీవ్ వచ్చింది. అయితే వాళ్లకు ఒమిక్రాన్ వచ్చిందా.. లేదా అనే విషయం కొన్ని రోజుల్లోనే తెలియనుంది. ఇతర దేశాలనుంచి వచ్చే ప్రతి ఒక్కరికీ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కరోనా టెస్ట్ లు ఖచ్చితంగా చేస్తున్నాం.
ఇతర దేశాల్లో మాదిరిగానే ఇండియాలో కూడా ఈ కేసులు మున్ముందు పెరిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అందుకే ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే మన దేశంలో 5 ఒమిక్రాన్ కేసులు వెలుగులోకొచ్చాయి. అయితే వారిలో లక్షణాలు తీవ్ర స్థాయిలో ఏమీ లేవు. ఒమ్రికాన్ భారిన పడితే నీరసం, తలనొప్పి, విపరీతమైన ఒళ్లు నొప్పులు ఉంటాయి. తప్పుడు వార్తలను నమ్మకండి. దీని వల్ల ప్రజల్లో ఆందోళన పెరగడం తప్ప మరేది ఉండదని ఆయన చెప్పుుకొచ్చారు.
భారత పౌరసత్వానికి 6 లక్షల మంది గుడ్బయ్ !
ఏమయ్యా రణ్ బీర్.. లెహంగ పొడవుగా ఉంటే అలా చేయాలా.. అయినా నీకెందుకంత పొగరు .?
ఏంజెల్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు
వామ్మో.. పాయల్ ఇలా చూపించావేంటి.. జనాలు ఉండాలా.. పోవాలా..?
వామ్మో.. విన్నర్ కు మించిన రెమ్యునరేషన్.. అందుకే యాంకర్ రవిని ఇంట్లో నుంచి పంపించారా?
Omicron: ఒమిక్రాన్.. డెల్టా కంటే 6 రెట్లు అధిక వ్యాప్తి
చర్చ లేకుండానే.. సాగు చట్టాల రద్దు బిల్లుకు లోక్సభ ఆమోదం
MSRTC: 6 వేల మంది ఉద్యోగులు సస్పెండ్
ప్చ్..ఇందుకోసమేనా యాంకర్ రవిని ఎలిమినేట్ చేసింది..