నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించండి..
• హన్మకొండలో షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష
దర్వాజ-హన్మకొండ
ఎన్నో ఎండ్ల పోరాటం సాగించి తెచ్చుకున్న తెలంగాణలో నేడు నిరుద్యోగులు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారనీ, వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే హన్మకొండలోని హయగ్రీవచారి మైదానంలో నిరాహార దీక్షకు దిగారు. ఆమెతో పాటు పలువురు నేతలు, నిరుద్యోగులు సైతం దీక్షలో ఉన్నారు. దీక్షలకు దిగే ముందు షర్మిల కాకతీయ యూనివర్సిటీ క్రాస్ రోడ్డులోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళులర్పించారు.
కాగా, నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం ఈ దీక్ష మంగళవారం సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనుంది. తెలంగాణలో దాదాపు 1.90 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయనీ, వాటిని వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో గలీజు రాజకీయాలు
గుంటూరులో విద్యార్థిని దారుణ హత్య
ఆప్ఘానిస్థాన్ లో తాలిబన్ల రాక్షస పాలన.. షరియా చట్టం
Share this content: