దర్వాజ-హైదరాబాద్
Hyderabad-Congress protests: హైదరాబాద్ లో గురువారం రాజ్భవన్ సమీపంలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నించడంపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. చలో రాజ్భవన్ కు పిలుపునిచ్చాయి. కాంగ్రెస్ నిరసలను ఉద్రిక్తలకు దారి తీశాయి. పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు కూడా చేశారు. వారిపై కేసులు నమోదుచేశారు.
కాంగ్రెస్ తెలంగాణ యూనిట్ ఇచ్చిన “చలో రాజ్ భవన్” పిలుపులో భాగంగా రాజ్ భవన్ ముట్టడికి నిరసనకారులు చేసిన ప్రయత్నాలను పోలీసులు భగ్నం చేశారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు, పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేత మల్లు భట్టి విక్రమార్కతో పాటు మరికొందరిని రాజ్భవన్కు తరలిస్తుండగా పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
అయినప్పటికీ మరికొంతమంది నేతలు పెద్ద ఎత్తున నిరసనతో ఖైరతాబాద్ సర్కిల్తోపాటు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఒక ద్విచక్ర వాహనానికి నిప్పంటించారు. కొంతమంది నిరసనకారులు రాష్ట్ర నడుపుతున్న సిటీ బస్సులపైకి ఎక్కి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం కనిపించింది. ఆందోళనకారులు బస్సు కిటికీ అద్దాలను ధ్వంసం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీకి, పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు. నిరసనల మధ్య, కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి ఇతర పోలీసు సిబ్బందిని తీసుకెళ్తుండగా ఒక పోలీసు కాలర్ ను పట్టుకున్నారు. కాంగ్రెస్ నిరసనలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
#WATCH | Telangana: Congress leader Renuka Chowdhury holds a Policeman by his collar while being taken away by other Police personnel during the party's protest in Hyderabad over ED summons to Rahul Gandhi. pic.twitter.com/PBqU7769LE
— ANI (@ANI) June 16, 2022
