దర్వాజ-హైదరాబాద్
75 years of India’s Independence: భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరుగుతున్న వేడుకల్లో భాగంగా స్వాతంత్య్ర ర్యాలీని ప్రారంభించేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) మంత్రి శ్రీనివాస్ గౌడ్ శనివారం గాల్లోకి కాల్పులు జరిపారు. మహబూబ్నగర్ పట్టణంలో ర్యాలీని ప్రారంభించేందుకు ఎక్సైజ్, క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఓ పోలీసు సెల్ఫ్లోడింగ్ రైఫిల్తో గాలిలోకి రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. పట్టణంలోని జిల్లా పరిషత్ గ్రౌండ్స్ నుంచి క్లాక్ టవర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాలుపంచుకున్న వారందరినీ ఆశ్చర్యపరుస్తూ మంత్రి తన పక్కనే ఉన్న కానిస్టేబుల్ తుపాకీని తీసుకుని కాల్పులు జరిపిన వీడియో వైరల్ గా మారింది. మంత్రిపై ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేస్తారా అని కొందరు నెటిజన్లు ప్రశ్నించారు.
It can only happen in #Telangana! #TRS Minister Srinivas Goud use a police weapon to fire shots during a crowded event ( top police sources say it's ILLEGAL). Twice this week, he used SLR (a prohibited bore weapon) to fire shots. I Hope @TelanganaDGP initiates action. pic.twitter.com/EBVJaSBz14
— Ashish (@KP_Aashish) August 13, 2022
మూడు రోజుల వ్యవధిలో మంత్రి రెండో సారి కూడా ఇదే పనికి దిగినట్లు సమాచారం. అయితే బుల్లెట్లు కాల్చినవి నిజమైనవా? లేక వేడుకలకు వినియోగించిన డమ్మీనా అనేది వెంటనే తెలియరాలేదు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో స్వాతంత్య్ర ర్యాలీలు నిర్వహించారు. మంత్రులు, ఎంపీలు, రాష్ట్ర శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, పోలీసు, సివిల్ అధికారులు, ఉద్యోగులు, వివిధ రంగాలకు చెందిన పౌరులు ర్యాలీలో పాల్గొన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజలక్ష్మి ఆధ్వర్యంలో హైదరాబాద్ నడిబొడ్డున ట్యాంక్ బండ్పై స్వాతంత్య్ర ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండాలు పట్టుకుని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) అధికారులు, ఉద్యోగులు ర్యాలీలో పాల్గొన్నారు.