Hyderabad: నగరవాసులకు గుడ్ న్యూస్.. MMTS ఛార్జీలు 50% తగ్గింపు.. !
దర్వాజ-హైదరాబాద్
MMTS ticket fare: హైదరాబాద్ ఎంఎంటీఎస్ (మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్) ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. నగరంలోని ఎంఎంటీఎస్ ఛార్జీలను తగ్గిస్తున్నట్టు వెల్లడించింది. ఫస్ట్ క్లాస్ ఛార్జీలను దాదాపు 50 శాతం మేర తగ్గించారు. MMTS ఛార్జీలను మే 5 నుండి ఫస్ట్ క్లాస్ సింగిల్ జర్నీ ప్రయాణికులకు 50 శాతం వరకు తగ్గనున్నాయి. SCR ఒక పత్రిక ప్రకటనలో కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ తర్వాత సేవలను తిరిగి ప్రారంభించినప్పటి నుండి దక్షిణ మధ్య రైల్వే సబ్-అర్బన్ ప్రయాణీకుల ప్రయోజనం కోసం MMTS సేవల సంఖ్యను క్రమంగా పెంచుతోందని తెలిపింది.
అలాగే, ఫలక్నుమా-సికింద్రాబాద్-హైదరాబాద్-బేగంపేట్-లింగంపల్లి-తేలాపూర్-రామచంద్రపురం విభాగాల్లో 29 రైల్వే స్టేషన్లను కవర్ చేస్తూ 50 కిలోమీటర్ల మేర 86 సర్వీసులు నడుపుతున్నామని వెల్లడించింది. పీక్ అవర్ ట్రాఫిక్ ను పరిగణలోకి తీసుకుని ప్రయాణీకుల ప్రయాణ అవసరాలను తీర్చే విధంగా సర్వీసులు నడుపుతున్నామని SCR జనరల్ మేనేజర్ (ఇన్-ఛార్జ్) అరుణ్ కుమార్ జైన్ వెల్లడించారు.
MMTS ఫస్ట్ క్లాస్లో తగ్గిన ఛార్జీల వివారలు ఇలా ఉన్నాయి..
Distance Slab (in km) | Existing Fare | From May 5 |
1-10 | Rs 50 | Rs 25 |
11-15 | Rs 65 | Rs 35 |
16-25 | Rs 100 | Rs 55 |
26-35 | Rs 145 | Rs 85 |
36-45 | Rs 155 | Rs 90 |
#MMTS First Class Fare reduced upto 50%
— South Central Railway (@SCRailwayIndia) May 3, 2022
•1st class base fares for suburban single journey have been reduced with effect from 05.05.2022
•Passengers travelling in the suburban sections between Falaknuma-Secunderabad–Hyderabad– Lingampalli-Ramchandrapuram will be benefitted pic.twitter.com/HVkIhsfLVt
Share this content: